నేడు తాడ్దాన్‌పల్లిలో కేసీఆర్‌ బహిరంగ సభ

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలంలోని తాడ్దాన్‌పల్లి శివారులో మంగళవారం సాయంత్రం నిర్వహించనున్న భారాస బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్‌ పాల్గొంటున్నారు.

Published : 16 Apr 2024 05:05 IST

జోగిపేట, పుల్కల్‌ - న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలంలోని తాడ్దాన్‌పల్లి శివారులో మంగళవారం సాయంత్రం నిర్వహించనున్న భారాస బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్‌ పాల్గొంటున్నారు. ఈ మేరకు సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని జహీరాబాద్‌, మెదక్‌ లోక్‌సభ స్థానాల పరిధిలోని అందోలు, సంగారెడ్డి, పటాన్‌చెరు, జహీరాబాద్‌, మెదక్‌, నారాయణఖేడ్‌, నర్సాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరు కానున్నారు. బహిరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌, భారాస నాయకులు సోమవారం పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని