ప్రధాని మోదీపై క్రిమినల్‌ కేసు పెట్టండి

మైసూరు ప్రచారంలో కాంగ్రెస్‌ను విచ్ఛిన్న ముఠాల సుల్తాన్‌ (తుక్డే తుక్డే ముఠాల సుల్తాన్‌ కాంగ్రెస్‌)గా ప్రధాని మోదీ అభివర్ణించడంపై హస్తం పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.

Published : 16 Apr 2024 05:25 IST

ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్‌ లేఖ

బెంగళూరు: మైసూరు ప్రచారంలో కాంగ్రెస్‌ను విచ్ఛిన్న ముఠాల సుల్తాన్‌ (తుక్డే తుక్డే ముఠాల సుల్తాన్‌ కాంగ్రెస్‌)గా ప్రధాని మోదీ అభివర్ణించడంపై హస్తం పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. మోదీపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు కర్ణాటక ముఖ్య ఎన్నికల అధికారికి కేపీసీసీ ఓ లేఖ రాసింది. కాంగ్రెస్‌ దాని మిత్రపక్షాలు అయోధ్య రామాలయ ప్రారంభాన్ని బహిష్కరించాయని, హిందూ మతంలోని బలాన్ని విచ్ఛినం చేయాలని ‘ఇండియా’ కూటమి కోరుకుంటోందని మోదీ ఆరోపించారని తన లేఖలో వివరించింది. ఇటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ప్రధానిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని