ఆ మూడు స్థానాల్లో భాజపా అభ్యర్థులకు ఓట్లేయొద్దు

లోక్‌సభ ఎన్నికల్లో తమ వర్గానికి భాజపా టికెట్లు ఇవ్వకపోవడంపై ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాజ్‌పూత్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Published : 18 Apr 2024 04:55 IST

యూపీలో రాజ్‌పూత్‌ల నిర్ణయం
తమ వర్గానికి టికెట్లు ఇవ్వనందుకే..

ముజఫర్‌నగర్‌: లోక్‌సభ ఎన్నికల్లో తమ వర్గానికి భాజపా టికెట్లు ఇవ్వకపోవడంపై ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాజ్‌పూత్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముజఫర్‌నగర్‌, కైరానా, సహారన్‌పుర్‌ నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులను బహిష్కరించాలని ఖేడా ప్రాంతంలో నిర్వహించిన మహాపంచాయత్‌లో నిర్ణయించారు. కిసాన్‌ మజ్దూర్‌ సంగఠన్‌ జాతీయాధ్యక్షుడు ఠాకుర్‌ పూరణ్‌ సింగ్‌ నేతృత్వంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఈ సభకు వివిధ జిల్లాల నుంచి రాజ్‌పూత్‌లు హాజరయ్యారు. ఎన్నికల్లో భాజపాకు బదులు ఇతర పార్టీల్లోని బలమైన అభ్యర్థులకు ఓటేయాలని నిర్ణయించినట్లు పూరణ్‌ సింగ్‌ తెలిపారు. యూపీలో ఈ నెల 19న లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని