Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొస్తాం: కర్ణాటక హోంమంత్రి
Prajwal Revanna: కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారిన లైంగిక దౌర్జన్యం కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొచ్చేందుకు సిట్ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోంమంత్రి వెల్లడించారు.
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో లైంగిన దౌర్జన్యం కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. దీంట్లో ప్రధాన నిందితుడిగా ఉన్న సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) ప్రస్తుతం విదేశాలకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అతడిని భారత్కు తీసుకొస్తామని రాష్ట్ర హోంమంత్రి జి.పరమేశ్వర సోమవారం తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్ ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
‘‘కర్ణాటక మహిళా కమిషన్ ఫిర్యాదు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఐపీఎస్ బి.కె.సింగ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. దీంట్లో ఇద్దరు మహిళా ఎస్పీలు కూడా ఉన్నారు. ఈ కేసు దర్యాప్తులో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదు. వీడియోలకు సంబంధించిన పెన్డ్రైవ్లను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ విభాగానికి పంపుతారు. మిగిలిన ఆధారాలను సేకరిస్తారు. అధికారిక సమాచారం ప్రకారం ప్రధాన నిందితుడు ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) విదేశాలకు వెళ్లారు. సిట్ ఆయన్ను ఇక్కడకు తీసుకొస్తుంది. ఈ కేసు దర్యాప్తు కోసం ఒక నిర్దిష్ట గడువును సూచించాం. లేదంటే ఏళ్లపాటు జాప్యం జరిగే ప్రమాదం ఉంది. 10-15 రోజుల్లో దీనిపై నివేదిక అందుతుందని అనుకుంటున్నాం. దాని ఆధారంగా చర్యలు ఉంటాయి’’ అని పరమేశ్వర మీడియాతో అన్నారు.
హాసన సెక్స్ కుంభకోణం..భాజపా-జేడీఎస్ కూటమిపై ప్రభావం ఎంత?
ఇదే తరహా ఆరోపణలతో హెచ్.డి.రేవణ్ణపై కూడా ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే. ఆయనపై కూడా విచారణ జరుపుతారని పరమేశ్వర తెలిపారు. సిట్ నివేదిక ఆధారంగానే ఆయనపైనా చర్యలుంటాయని పేర్కొన్నారు. ఈ కేసులో అవసరమైతే బాధితులు, ఫిర్యాదుదారులకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పిస్తుందని వెల్లడించారు.
ఎన్డీయే కూటమి అభ్యర్థిగా హాసన నుంచి పోటీ చేసిన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణతో (Prajwal Revanna) పాటు ఆయన తండ్రి, మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణలపై లైంగిక దౌర్జన్యం కేసు నమోదైన విషయం తెలిసిందే. వారిద్దరి వల్ల పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటోందని జేడీఎస్ నేతలు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణను పార్టీ నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్డీ కుమారస్వామి సోమవారం ప్రకటించారు. ఇదే అంశంపై మంగళవారం అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా.. 30 వేల నియామకాలు ఎలా చేపట్టారు?
అభయహస్తం అంటూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలపై భస్మాసుర హస్తం మోపుతోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ గెలుపొందాక ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా 30 వేల నియామకాలు ఎలా చేపట్టిందో చెప్పాలని ప్రశ్నించారు. -
నాయకులను కొనుగోలు చేస్తున్న సీఎం
రాష్ట్రంలో ప్రజల సమస్యలు పట్టించుకోకుండా సీఎం రేవంత్రెడ్డి ఓట్లు, నాయకులను కొనుగోలు చేస్తున్నారని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ ఆరోపించారు. ఆరు గ్యారంటీల అమలు అంశానికి అతీగతీ లేదని విమర్శించారు. -
ఏపీ ఎన్నికల్లో తెదేపాకే మొగ్గు
ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో తెదేపా, వైకాపాల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లు సాగినప్పటికీ మొగ్గు తెదేపావైపే కనిపిస్తోందని దిల్లీలోని ప్రముఖ పరిశోధన సంస్థ సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్)కు చెందిన సీనియర్ సెఫాలజిస్ట్ ప్రొఫెసర్ సంజయ్కుమార్ తెలిపారు. -
రాళ్లదాడి ఘటనలో 47 మందిపై కేసు
వైఎస్సార్ జిల్లా కడప రెండో పట్టణ పోలీసుస్టేషన్ పరిధి గౌస్నగర్లో ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13న రాత్రి వైకాపా, తెదేపా నేతలు, కార్యకర్తల మధ్య జరిగిన రాళ్లదాడి ఘటనకు సంబంధించి పోలీసులు ఎట్టకేలకు సోమవారం కేసులు నమోదు చేశారు. -
తెదేపా ముసుగులో విద్వేష ప్రసంగాలు చేస్తున్న కృష్ణారెడ్డిని అరెస్టు చేయాలి
సామాజిక మాధ్యమాల్లో తెదేపా కండువా ధరించి కులాల మధ్య వైషమ్యాలు సృష్టించేలా వీడియోలు చేస్తున్న వైకాపా నాయకుడు మన్విత్ కృష్ణారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐడీ అధికారులకు తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. -
బాధితులకు అండగా నిలిచిన మీడియాపై కేసులా?
వైకాపాకు ఓట్లేయలేదన్న కక్షతో విశాఖ కంచరపాలెంలోని ఓ కుటుంబంపై ఆ పార్టీ నేతలు చేసిన దాడి ఘటనను తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఎన్డీయే నేతలు మండిపడ్డారు. -
ఎవరొస్తారో రండ్రా.. అంటూ బోరుగడ్డ అనిల్ వీరంగం!
వైకాపా నాయకుడిగా చలామణి అవుతున్న బోరుగడ్డ అనిల్, తన అనుయాయులతో కలిసి కర్రలు పట్టుకుని సోమవారం రాత్రి గుంటూరు వేళాంగిణినగర్లో హల్చల్ చేశారు. -
సిట్ సభ్యులు మాచర్ల ఎందుకు వెళ్లలేదు?
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు, ఆ మర్నాడు పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు నియమించిన సిట్.. అసలు మాచర్ల పట్టణానికి వెళ్లలేదని తెలుస్తోంది. -
హింసాత్మక ఘటనలకు సీఎస్ జవహర్రెడ్డే బాధ్యుడు
రాష్ట్రంలో ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలకు సీఎస్ జవహర్రెడ్డే బాధ్యుడని తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. -
వైకాపాకు ఓటేయకపోతే దాడులే
ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్లు వేయలేదని కక్షగట్టి సామాన్యులపై దాడులకు దిగడం వంటి ఘటనల్ని ఇది వరకు ఫ్యాక్షన్ ప్రభావితమైన కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చూసేవాళ్లం.
తాజా వార్తలు (Latest News)
-
రేవ్ పార్టీ హైదరాబాద్లో వద్దనుకొని.. బెంగళూరును ఎంచుకుని..
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్