పొన్నూరు వైకాపా అభ్యర్థిపై చర్యలకు ఆదేశం

గుంటూరు జిల్లా పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనా గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు.

Published : 19 Apr 2024 05:48 IST

పొన్నూరు, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనా గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. గత నెల 18న పొన్నూరు మండల పరిధి ములుకుదురులో కొంత మంది మహిళలకు అంబటి మురళీకృష్ణ చెక్కులు పంపిణీ చేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత వైకాపా అభ్యర్థి చెక్కులు పంపిణీ చేయడంపై తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ సీఈఓకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు విచారణ చేపట్టి నివేదికను ఎన్నికల అధికారులకు పంపించారు. నివేదికను పరిశీలించిన సీఈఓ చర్యలకు ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని