అసత్య ఆరోపణలతో ప్రతిష్ఠకు భంగం

వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌కు తెదేపా ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌ శుక్రవారం తన న్యాయవాది శ్రీవెంకటేష్‌ ద్వారా లీగల్‌ నోటీసు పంపించారు. మాధవ్‌ గురువారం విలేకరుల

Published : 06 Aug 2022 04:28 IST

రూ.50 లక్షల పరిహారం చెల్లించండి

వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌కు  తెదేపా నేత విజయ్‌ లీగల్‌ నోటీసు

ఈనాడు, అమరావతి: వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌కు తెదేపా ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌ శుక్రవారం తన న్యాయవాది శ్రీవెంకటేష్‌ ద్వారా లీగల్‌ నోటీసు పంపించారు. మాధవ్‌ గురువారం విలేకరుల సమావేశంలో తనపై అసత్య ఆరోపణలు చేశారని, దాని వల్ల తన పరువు ప్రతిష్ఠలకు తీవ్ర భంగం వాటిల్లిందని విజయ్‌ పేర్కొన్నారు. తనకు జరిగిన పరువునష్టానికి గాను వారంలో రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని, లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. గోరంట్ల మాధవ్‌ ఒక మహిళతో నగ్నంగా వీడియోకాల్‌ మాట్లాడారంటూ గురువారం సామాజిక మాధ్యమాల్లో వీడియో ప్రచారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అది మార్ఫింగ్‌ చేసిన వీడియో అని, చింతకాయల విజయ్‌ సహా మరికొందరు దాన్ని ప్రచారంలో పెట్టారని మాధవ్‌ ఆరోపించారు. దానిపై విజయ్‌ గురువారమే తీవ్రంగా స్పందించి లీగల్‌ నోటీసు ఇస్తానని హెచ్చరించారు. దానిలో భాగంగానే శుక్రవారం నోటీసు పంపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని