రైతుల పాదయాత్రపై ఆంక్షలెందుకు?
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న రైతుల పాదయాత్రపై అన్ని ఆంక్షలు ఎందుకని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగన్ను సీఎంగా దిగిపొమ్మని.
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
నెహ్రూనగర్ (గుంటూరు), న్యూస్టుడే: అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న రైతుల పాదయాత్రపై అన్ని ఆంక్షలు ఎందుకని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగన్ను సీఎంగా దిగిపొమ్మని.. వాళ్లు గద్దె ఎక్కుతామని అడగడం లేదు కదా అని ఆయన నిలదీశారు. శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న వారిపై ఒక పక్క వైకాపా కార్యకర్తలు, మరో పక్క పోలీసులు దాడులు చేయడం దుర్మార్గపు చర్యని మండిపడ్డారు. ఆదివారం గుంటూరులో నారాయణ విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్రెడ్డి అమరావతిని రాజధానిగా అంగీకరించి ఇప్పుడు మూడు రాజధానులంటూ మాటమార్చారని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజలు చాలా మంచివారని, రాజధాని రైతుల పాదయాత్రను అడ్డుకోరని.. అలాంటిది ఏమైనా చేస్తే వైకాపా గూండాలు మాత్రమే చేస్తారని చెప్పారు. అక్టోబరు 14 నుంచి 18 వరకు విజయవాడలో జరగనున్న సీపీఐ జాతీయ మహాసభలు భాజపా వ్యతిరేక కూటమి బలపడేందుకు వేదిక కానున్నట్లు చెప్పారు. ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చడం సరికాదని.. చనిపోయిన నాయకుల పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ