నాకు దేశవ్యాప్త మద్దతు ఉంది
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో తన పోటీకి దేశవ్యాప్తంగా పార్టీ కార్యకర్తల నుంచి మద్దతు లభిస్తోందని అదే పార్టీకి చెందిన సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ సోమవారం వ్యాఖ్యానించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అభ్యర్థిత్వంపై
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై శశిథరూర్ వ్యాఖ్య
పాలక్కడ్: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో తన పోటీకి దేశవ్యాప్తంగా పార్టీ కార్యకర్తల నుంచి మద్దతు లభిస్తోందని అదే పార్టీకి చెందిన సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ సోమవారం వ్యాఖ్యానించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అభ్యర్థిత్వంపై అనిశ్చితి నెలకొన్న తరుణంలో థరూర్.. భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న రాహుల్గాంధీని పట్టంబిలో కలుసుకున్నారు. ‘‘నేను నామినేషన్ పత్రం దాఖలు చేసినప్పుడు నాకు గల మద్దతును మీరు చూస్తారు. ఎక్కువ రాష్ట్రాల నుంచి పార్టీ కార్యకర్తల మద్దతు లభిస్తేనే నేను కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతాను. దేశంలోని పలు ప్రాంతాల నుంచి పోటీ చేయాలంటూ అనేక మంది నుంచి నాకు అభ్యర్థనలు అందుతున్నాయి. పోటీ విషయంపై సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీలతో మాట్లాడా. తమకేం అభ్యంతరం లేదని ముగ్గురూ స్పష్టంగా చెప్పారు. కేరళ కార్యకర్తలు సైతం నాకు అండగా ఉన్నారు’’ అని థరూర్ తనను కలిసిన విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఎన్నికల్లో పోటీ చేయాలని తనకు ఆసక్తి ఉందని, అయితే ఈ నెల 30న స్పష్టత వస్తుందని వెల్లడించారు. అదేరోజు నామినేషన్ దాఖలుకు చివరిరోజు. గత శనివారమే ఆయన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నామినేషన్ దరఖాస్తును తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.