విశాఖ దోపిడీకి కుట్ర: అచ్చెన్నాయుడు

విశాఖను దోచుకునేందుకు సీఎం, ఆయన అనుచరులు కుట్ర చేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు.

Published : 28 Sep 2022 04:26 IST

ఈనాడు, అమరావతి- టెక్కలి, టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: విశాఖను దోచుకునేందుకు సీఎం, ఆయన అనుచరులు కుట్ర చేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో మంగళవారం నుంచి ప్రారంభమైన కొత్తమ్మ తల్లి ఉత్సవాల్లో అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... అసమర్థ మంత్రులతోనే ఉత్తరాంధ్రకు నష్టం కలుగుతోందన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక హెచ్‌ఎస్‌బీసీ తరలిపోయిందని, డేటాసెంటర్‌ ప్రారంభం కాలేదని, సుజల స్రవంతి పనుల టెండర్లు రద్దు చేశారని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని