కేసీఆర్ ప్రధాని కావాలని కోరిక... కోళ్లు, మద్యం పంపిణీ
జాతీయ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవంతం కావాలని కోరుతూ మంగళవారం వరంగల్ చౌరస్తాలో తెరాస నాయకుడు రాజనాల శ్రీహరి 200 మంది హమాలీలకు కోళ్లు, మద్యం పంచారు.
న్యూస్టుడే, మట్టెవాడ(వరంగల్): జాతీయ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవంతం కావాలని కోరుతూ మంగళవారం వరంగల్ చౌరస్తాలో తెరాస నాయకుడు రాజనాల శ్రీహరి 200 మంది హమాలీలకు కోళ్లు, మద్యం పంచారు. ఇలా బహిరంగంగా పంచడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. హమాలీలకు ఒక్కొక్కరికి క్వార్టర్ మద్యం సీసా, ఒక కోడిని పంపిణీ చేశారు. ప్రధానిగా కేసీఆర్, ముఖ్యమంత్రిగా కేటీఆర్ కావాలని ఆకాంక్షిస్తూ దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేసి అనంతరం వీటిని పంపిణీ చేసినట్లు ఆయన ‘న్యూస్టుడే’కు తెలిపారు. దేశ రాజకీయాలు మార్చే సత్తా, నీతిపాలన అందించే సమర్థత ఒక్క కేసీఆర్కే ఉన్నాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.