ప్రశ్నించిన వారి ప్రాణాలు తీయడమే ‘పెద్దిరెడ్డి ప్రజాస్వామ్యం’: లోకేశ్‌

ప్రశ్నించిన వారి ప్రాణాలు తీయడమేనా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తెలిసిన ప్రజాస్వామ్యమని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు.

Published : 06 Dec 2022 04:48 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రశ్నించిన వారి ప్రాణాలు తీయడమేనా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తెలిసిన ప్రజాస్వామ్యమని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. ఒకవైపు ‘జయహో బీసీ’ అంటూ...మరోవైపు బీసీ నేత, పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్‌ను అంతమొందించేందుకు పెద్దిరెడ్డి కుతంత్రాలు పన్నుతున్నారని మండిపడ్డారు. ‘‘ఆయన బీసీ కావడమే నేరమా? రైతు సదస్సు నిర్వహించాలనుకోవడం ద్రోహమా? ఒక బీసీ నేతను చంపాలని పెద్దిరెడ్డి మనుషులు దాడికి దిగితే, పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం దారుణం...’’ అని లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.

శివబాబుపై హత్యాయత్నం అబ్బయ్యచౌదరి పనే

మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ముఖ్య అనుచరుడు శివబాబుపై హత్యాయత్నం వైకాపా ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి పనేనని నారా లోకేశ్‌ మండిపడ్డారు. ‘‘గ్రావెల్‌, మట్టి, మైనింగ్‌ మాఫియా గుట్టురట్టు చేశారనే కక్షతో శివబాబుపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. అధికారం అండతో అబ్బయ్యచౌదరి చేస్తున్న అరాచకాలు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి...’’ అని నారా లోకేశ్‌ హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని