Gujarat: గుజరాత్ ఎన్నికల్లో ‘సన్’రైజ్.. 20 చోట్ల వారసుల పోటీ..!
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు రాజకీయ నేతల వారసులు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ 13 చోట్ల, భాజపా 7 చోట్ల సిట్టింగ్, మాజీ ఎమ్మెల్యేల కుమారులకు టికెట్లు ఇచ్చింది.
అహ్మదాబాద్: సాధారణ సమయాల్లో వారసత్వ రాజకీయాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించే రాజకీయ పార్టీలు.. ఎన్నికల సమయంలో మాత్రం ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉంటాయి. త్వరలో జరగబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పలు స్థానాల్లో వారసులు బరిలోకి దిగుతున్నారు. ఈ ఎన్నికల్లో అధికార భాజపా, ప్రతిపక్ష కాంగ్రెస్ కలిసి కనీసం 20 మంది సిట్టింగ్, మాజీ ఎమ్మెల్యేల కుమారులకు టికెట్లు ఇచ్చింది.
గుజరాత్లో డిసెంబరు 1, 5వ తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 13 చోట్ల, భాజపా 7 చోట్ల సిట్టింగ్ లేదా మాజీ ఎమ్మెల్యేల కుమారులను నిలబెట్టింది. విజయావకాశాలు, ఆయా నియోజకవర్గాల్లో మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో రాజకీయ పార్టీలు ఇలా వారసులకు టికెట్లు ఇస్తుంటాయి.
* దశాబ్దాల పాటు కాంగ్రెస్కు పనిచేస్తూ 10 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదివాసీ నేత మోహన్సిన్హ్ రత్వా ఇటీవల హస్తం పార్టీతో బంధం తెంచుకుని భాజపాలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న చోటా ఉదయ్పుర్ స్థానాన్ని భాజపా రత్వా కుమారుడు రాజేందర్సిన్హ్కు కేటాయించింది. ఇక, ఇదే స్థానంలో కాంగ్రెస్ సంగ్రామ్సిన్హ్ రత్వాను బరిలోకి దించింది. ఈయన.. రైల్వే శాఖ మాజీ మంత్రి నరన్ రత్వా కుమారుడు. రాజేందర్, సంగ్రామ్ ఇద్దరికీ రాజకీయ అరంగేట్రం ఇదే కావడం విశేషం.
* థస్రా శాసనసభ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న యోగేంద్ర పార్మర్.. మాజీ ఎమ్మెల్యే రామ్సిన్హ్ పార్మర్ కుమారుడు. రామ్సిన్హ్ గతంలో రెండుసార్లు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి భాజపాలో చేరారు.
* గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్సిన్హ్ వాఘేలా కుమారుడు మహేంద్రసింగ్ వాఘేలా గత నెల మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజా ఎన్నికల్లో ఆయన బయద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసిన మహేంద్ర సింగ్ ఆ మధ్య భాజపాలో చేరారు. ఇటీవల కాషాయ పార్టీని వీడి మళ్లీ.. హస్తం పార్టీలో చేరారు.
* మరో మాజీ ముఖ్యమంత్రి అమర్సిన్హ్ చౌదరీ కుమారుడు తుషార్ చౌదరీ.. కాంగ్రెస్ అభ్యర్థిగా బర్దౌలీ నుంచి బరిలోకి దిగారు. గతంలో ఆయన రెండు సార్లు ఎంపీగా పనిచేశారు. వీరితో పాటు అనేక మంది సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల కుమారులు ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. దీంతో ఆయా అసెంబ్లీ స్థానాల పోరు ఆసక్తికరంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు