Sukhwinder Sukhu: నాడు పాల విక్రేత.. నేడు సీఎం!
మొదట్లో.. సాధారణ జీవనమే. తండ్రి.. రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్. తానూ ఒకప్పుడు పాలు విక్రయించాడు. ఇప్పుడు రాష్ట్రాన్నే పాలించనున్నాడు. ఆయనే.. హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న సుఖ్విందర్ సింగ్ సుఖు(Sukhwinder Sukhu). సీఎంగా ఆయన పేరును కాంగ్రెస్ పార్టీ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే.
శిమ్లా: మొదట్లో.. సాధారణ జీవనమే. తండ్రి.. రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్. తానూ ఒకప్పుడు పాలు విక్రయించాడు. ఇప్పుడు రాష్ట్రాన్నే పాలించనున్నాడు. ఆయనే.. హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న సుఖ్విందర్ సింగ్ సుఖు(Sukhwinder Sukhu). సీఎంగా ఆయన పేరును కాంగ్రెస్ పార్టీ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. భాజపాకు చెందిన ప్రేమ్ కుమార్ ధుమాల్ తర్వాత.. హమీర్పూర్ జిల్లా నుంచి ఆయన రెండో ముఖ్యమంత్రి కానున్నారు. మొత్తంగా చూస్తే.. రాష్ట్రానికి ఏడో సీఎం.
ఎస్ఎస్ సుఖు.. దిగువ హిమాచల్కు చెందిన కాంగ్రెస్ నేత. పార్టీతో నాలుగు దశాబ్దాల అనుబంధం ఉంది. 1980ల్లో ఎన్ఎస్యూఐ విద్యార్థి రాజకీయాలనుంచి యూత్ కాంగ్రెస్ నాయకుడిగా.. ఇలా అంచెలంచెలుగా ఎదిగి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ పనిచేశారు. 2003లో తొలిసారి మొదలు.. నాదౌన్ అసెంబ్లీ స్థానం నుంచి ఇప్పటివరకు నాలుగుసార్లు గెలుపొందారు. 58 ఏళ్ల సుఖుకు రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా పేరుంది. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించి.. పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.
వృత్తిరీత్యా న్యాయవాది అయిన సుఖు.. హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ నుంచి ఎంఏ, ఎల్ఎల్బీ చదివారు. రెండుసార్లు శిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. వర్సిటీ రాజకీయాల్లో దూకుడు కారణంగా.. ఆయనకు ఫైర్బ్రాండ్గా గుర్తింపు ఉంది. 2013 నుంచి 2019 మధ్య రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్గా ఉన్న సమయంలో.. పార్టీని బలోపేతం చేశారు. ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టిందని రాజకీయ ప్రముఖులు విశ్లేషిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు