Ap News: ‘చెత్త పన్ను’ పేరుతో పీడిస్తారా?: నాదెండ్ల
కరోనా వ్యాప్తితో రాష్ట్ర ప్రజలంతా తీవ్ర భయాందోళనలకు గురవుతూ, ఆర్థిక సమస్యలతో కొట్టిమిట్టాడుతుంటే వారిలో ధైర్యం ..
అమరావతి: కరోనా వ్యాప్తితో రాష్ట్ర ప్రజలంతా తీవ్ర భయాందోళనలకు గురవుతూ, ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే వారిలో ధైర్యం నింపాల్సిన ప్రభుత్వం బాధ్యతను విస్మరించిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఏపీలోని మున్సిపాలిటీల్లో చెత్త పన్ను వసూలు చేయడాన్ని జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ‘‘ప్రజల బాధలను తీర్చాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. అందువల్లే ప్రతి ఇంటి నుంచి నెలకు రూ.90 నుంచి రూ.200 వసూలు చేయాలని నిర్ణయించింది. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు నగదు ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఈ ‘ చెత్త వ్యవహారం’పై ఏం చెబుతారు?’’ అని నాదెండ్ల ప్రశ్నించారు. ఇదంతా ఒక చేత్తో ఇచ్చి.. మరో చేత్తో గుంజుకునే వ్యవహారమేనని ఎద్దేవా చేశారు.
మహమ్మారి విరుచుకుపడిన తరుణంలో ప్రజలు ఉపాధికి దూరమై ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారని నాదెండ్ల అన్నారు. వారిని ఆ సమస్య నుంచి గట్టెక్కించకుండా తిరిగి పన్నుల రూపంలో ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ఏపీ ప్రజలు ఇంకెన్ని పన్నులు భరించాల్సి వస్తుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లోనైనా, మున్సిపాలిటీల్లోనైనా పారిశుద్ధ్య నిర్వహణ ప్రభుత్వ భాధ్యత అనీ, దాని నుంచి తప్పించుకునేందుకే ఇలాంటి పన్నులు విధిస్తోందని నాదెండ్ల ఆరోపించారు. వైకాపా గత రెండేళ్ల పాలనలో ఏ పట్టణంలోనైనా, ఏ డంపింగ్ యార్డులోనైనా ఆధునిక విధానంలో చెత్తను తగులబెట్టిందా? అని ప్రశ్నించారు. పర్యావరణ హితమైన మార్గాల్లో చెత్త నుంచి సంపద సృష్టించే ప్రయత్నం చేసిందా? అని అన్నారు. గతంలో చెత్తను ఎరువుగా మార్చేందుకు కేంద్రాలు నిర్మించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ప్రస్తుతం ఆ కేంద్రాల నిర్వహణ ఎలా ఉంది? దానిపై రాబడి వస్తోందా? అసలు ఇప్పుడు చెత్తపై పన్నులు వసూలు చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? తదితర ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని నాదెండ్ల డిమాండ్ చేశారు. చెత్తపై పన్ను విధించాలనే ఆదేశాలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు