Andhra News: శివప్రకాష్జీతో కన్నా అనూహ్య భేటీ.. సోము వీర్రాజుపై ఫిర్యాదు?
భాజపా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీరుపై అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ అనూహ్యంగా పార్టీ జాతీయ నాయకుడు శివప్రకాష్జీతో భేటీ అయ్యారు.
ఈనాడు డిజిటల్, అమరావతి: భాజపా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీరుపై అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ అనూహ్యంగా పార్టీ జాతీయ నాయకుడు శివప్రకాష్జీతో భేటీ అయ్యారు. విజయవాడలో శుక్రవారం రాత్రి దాదాపు గంటన్నరపాటు జరిగిన వీరి భేటీలో సోము వీర్రాజుపై కన్నా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇటీవల దిల్లీలో జాతీయ కార్యవర్గ సమావేశాలు, భీమవరంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు దూరంగా ఉన్న ఆయన.. శివప్రకాష్జీతో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో కన్నా.. సోము వీర్రాజు వైఖరి గురించి వివరించినట్లు తెలిసింది. ప్రధానంగా పార్టీ జిల్లా అధ్యక్షుల మార్పుపై ఎవరినీ సంప్రదించలేదని, దీని వల్ల కొందరు రాజీనామాలు చేశారని వివరించినట్లు సమాచారం. శివప్రకాష్ జీ.. తాను పార్టీ నేతల నుంచి సేకరించిన సమాచారంపై కన్నా నుంచి వివరణ కోరినట్లు తెలిసింది. సమావేశానంతరం కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్ర భాజపాలోని ప్రస్తుత పరిస్థితులపైనే శివప్రకాష్ జీతో చర్చించా. సోము వీర్రాజు మీద ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఇటీవల నేను చేసిన కామెంట్లపై కూడా చర్చ జరగలేదు’ అని పేర్కొన్నారు. పార్టీ చేపట్టబోయే కార్యక్రమాల గురించి సోము వీర్రాజునే అడగాలన్నారు. పార్టీ మారడం లేదని తాను చెప్పినా.. మీడియా పదేపదే అదే ప్రస్తావిస్తోందని ఆరోపించారు. జనసేన నేత నాదెండ్లను ఓ స్నేహితునిగా కలుసుకోవడం కూడా తప్పేనా? అని ప్రశ్నించారు. పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్న నేతలున్నారని, అలాంటి వారికి అవమానాలు జరుగుతున్నాయని, నరసరావుపేట జిల్లా అధ్యక్షుని విషయంలో అదే జరిగిందని వెల్లడించారు. ఇలాంటి కారణాల వల్లే పెదకూరపాడులో కొందరు రాజీనామా చేశారని, అయితే ఆ రాజీనామాల గురించి కూడా శివప్రకాష్ జీతో జరిపిన భేటీలో చర్చించలేదని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం