kishan Reddy : పారిశుద్ధ్య కార్మికురాలి ఇంట్లో కిషన్రెడ్డి అల్పాహారం
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర సూర్యాపేటకు చేరింది. స్థానిక చింతల చెరువులో
సూర్యాపేట : కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర సూర్యాపేటకు చేరింది. స్థానిక చింతల చెరువులో జాతీయ ఉత్తమ పారిశుద్ధ్య కార్మికురాలిగా అవార్డు పొందిన మెరుగు మారతమ్మ ఇంట్లో ఆయన అల్పాహారం చేశారు. అనంతరం ఆమెను సన్మానించారు. కల్నల్ సంతోష్బాబు విగ్రహానికి కిషన్రెడ్డి నివాళులర్పించారు. ఆ తర్వాత రెండో రోజు యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడారు.
‘కేబినెట్ మంత్రిగా ప్రధాని నరేంద్ర మోదీ నాకు పదోన్నతి కల్పించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ప్రధాని ఆదేశించారు. రైతులు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాలను కలవాలని కోరారు. జాతీయ అవార్డు పొందిన పారిశుద్ధ్య కార్మికురాలు మారతమ్మ ఇంట్లో అల్పాహారం తీసుకున్నాను. కరోనా పరిస్థితుల్లో ఒక్క రోజు కూడా డుమ్మా కొట్టకుండా ఆమె విధులు నిర్వర్తించారు. కరోనాను అరికట్టాలంటే ప్రజల సహకారం కావాలి. చిన్న పిల్లలకు కరోనా వ్యాక్సిన్ను ప్రధాని త్వరలో ప్రారంభిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తున్నారు. దీపావళి వరకు ఇచ్చే ఉచిత బియ్యం పంపిణీని అవసరమైతే మరికొన్ని రోజులు ఇస్తాం. కరోనాతో చనిపోయిన జర్నలిస్టులకు రూ.5 లక్షల చొప్పున కేంద్రం సాయం అందిస్తుంది. కరోనా బారిన పడి చనిపోయిన కుటుంబాలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించి విద్యాభ్యాసం అందిస్తాం. కరోనా వారియర్స్ను ప్రోత్సహించాలి. కరోనా సమయంలో గాంధీ ఆస్పత్రిని తొమ్మిది సార్లు పరిశీలించాను’ అని కిషన్ రెడ్డి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు