Kishan Reddy: భారాసను ఓడించే శక్తి భాజపాకి మాత్రమే ఉంది: కిషన్‌రెడ్డి

భారాసను ఓడించే శక్తి భాజపాకి మాత్రమే ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర పధాదికారుల సమావేశం జరిగింది.

Published : 11 Jul 2023 17:47 IST

హైదరాబాద్: భారాసను ఓడించే శక్తి భాజపాకి మాత్రమే ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర పధాదికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, పదాధికారులు హాజరయ్యారు. వచ్చే మూడు నెలలు సమగ్రంగా ప్రణాళిక చేసుకుని ప్రజల వద్దకు వెళ్లాలని నేతలకు దిశా నిర్దేశం చేశారు. భారాసను ఓడించి తెలంగాణలో అవినీతిరహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. భారాస ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాటం చేయాలని కిషన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. భాజపా పోరాటంలో ప్రజలను సంఘటితం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని