Andhra news: రోజూ ఏదో ఒక కుట్ర: తెదేపాపై కొడాలి నాని ఫైర్
మహిళల్ని అడ్డం పెట్టుకొని తెదేపా నేతలు అధికారంలోకి రావాలని చూస్తున్నారని వైకాపా నేత, మాజీ మంత్రి కొడాలి నాని....
విజయవాడ: మహిళల్ని అడ్డం పెట్టుకొని తెదేపా నేతలు అధికారంలోకి రావాలని చూస్తున్నారని వైకాపా నేత, మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. ప్రభుత్వంపై రోజూ ఏదో ఒక కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై అమెరికాలోని ఓ ప్రైవేటు ఫోరెన్సిక్ ల్యాబ్ ఎలా ప్రామాణికం అవుతుంది.. ఆ నివేదికను తాము గుర్తించబోమంటూ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ చేసిన ప్రకటన తర్వాత నాని మీడియాతో మాట్లాడారు. గోరంట్ల మాధవ్ మహిళల్ని వేధించినట్టో, ఇలా వీడియో కాల్ చేసి ఇబ్బంది పెట్టినట్టో ఒక్క ఫిర్యాదు చేయించినా విచారణ జరిపి అవసరమైతే అరెస్టు చేయిస్తామని ప్రభుత్వం ఇప్పటికే చెప్పిందన్నారు. కానీ, తమ వద్ద ఆధారాలు ఉంటున్నాయంటోన్న తెదేపా నేతలు ఆ మహిళతో ఫిర్యాదు చేయించి, అసలైన వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించమంటే అదీ చేయడంలేదని మండిపడ్డారు. నకిలీ వీడియోని సృష్టించి దాంతో రాజకీయం చేస్తున్నారన్నారు. పదవులను మాత్రం తన సామాజిక వర్గం మహిళలకే ఇస్తున్న చంద్రబాబు.. ఇలాంటి వీడియోలపై మాత్రం దళిత మహిళలతో మాట్లాడిస్తున్నారంటూ నాని ఆరోపించారు.
అశ్లీల వీడియోలతో రాజకీయం చేస్తున్నారు: పేర్ని నాని
తాడేపల్లి: అశ్లీల వీడియోలతో తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తోందని వైకాపా ఎమ్మెల్యే, మాజీమంత్రి పేర్ని నాని విమర్శించారు. మాధవ్ వీడియో వ్యవహారంపై తాడేపల్లిలోని పార్టీ కార్యాయలంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పోతిన ప్రసాద్ దొంగ రిపోర్టును ప్రచారం చేశారని అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రతినిధి జిమ్స్ స్టాఫర్డ్ లిఖిత పూర్వకంగా తెలిపారు. ఈ రిపోర్టును ట్యాంపర్ చేయించడం చంద్రబాబు నేరం కాదా?. ఒరిజినల్ వీడియో లేనప్పుడు.. ఎన్ని జిమ్మిక్కులు చేసి తప్పుడు రిపోర్టులు తెచ్చినా.. వైకాపా ప్రభుత్వం, ఎంపీ మాధవ్పై మీ కుట్రలు ఫలించవు. ఈ వీడియో మొత్తం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, లోకేశ్ సృష్టించిందే. ఈ వీడియోను పోస్టు చేసింది తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లో. వీడియో తయారు చేసినందుకు తెలుగుదేశం పార్టీని, పోస్టు చేయించినందుకు చంద్రబాబును, అశ్లీల విడియోను పదే పదే చూపించిన టీవీ ఛానళ్ల యాజమాన్యాలను చట్టపరంగా అరెస్టు చేయాల్సిన అవసరముంది. అమెరికా సంస్థే ఇది అబద్ధమని చెబుతున్నప్పుడు తెదేపాపై, మీడియాపై వైకాపా తరఫున పోలీసులకు ఫిర్యాదు చేయదల్చుకున్నాం’’ అని పేర్ని నాని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!