KTR: కర్మ సిద్ధాంతం ప్రకారం చేసింది తిరిగి అనుభవించాల్సిందే: కేటీఆర్
గుజరాత్లో 2002లో చోటుచేసుకున్న బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో 11 మంది దోషులను అక్కడి ప్రభుత్వం విడుదల చేయడంపై మంత్రి
హైదరాబాద్: గుజరాత్లో 2002లో చోటుచేసుకున్న బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో 11 మంది దోషులను అక్కడి ప్రభుత్వం విడుదల చేయడంపై మంత్రి కేటీఆర్ భాజపాపై విమర్శలు గుప్పించారు. ఒమిషన్, కమిషన్, రెమిషన్ లాంటి చర్యలను మరిచిపోలేమని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ట్విటర్లో స్పందించిన కేటీఆర్.. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలిచేందుకు అభివృద్ధి, భద్రత, సంక్షేమంపై ఎన్నో హామీలు చూశామన్నారు. అయితే, ఇప్పుడు రేపిస్టులు, గర్భిణిలు, చిన్నారులను హత్య చేసిన వారిని విడుదల చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి ఖైదీల విడుదల, శిక్ష తగ్గింపు ఎప్పటికీ మరిచిపోలేమన్న ఆయన... కర్మ సిద్ధాంతం ప్రకారం చేసింది తిరిగి అనుభవించాల్సిందేనని గుర్తు చేశారు.
సీజేఐకు లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత
బిల్కిస్బానో అత్యాచార కేసులో దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై జోక్యం చేసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. అత్యాచారం వంటి నేరాల్లో శిక్ష పడిన దోషులు స్వాతంత్ర్య దినోత్సవాన విడుదల కావడం ప్రజల వెన్నులో వణుకు పుడుతోందని లేఖలో పేర్కొన్నారు. సీబీఐ కేసుల్లో దోషులకు శిక్ష తగ్గింపు లేదా విడుదల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సీఆర్పీసీ చెబుతోందన్నారు. ఈ కేసులో దోషుల విడుదలకు గుజరాత్ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించిందో లేదో తెలియదన్నారు. శిక్ష తగ్గింపులో ప్రభుత్వాలు ఏకపక్షంగా అధికారాలను ఉపయోగించవద్దని, వాస్తవిక దృష్టితో చూడాలని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసిందన్నారు. రేపిస్టులు బయటకు రావడాన్ని, పూలదండలతో వారికి స్వాగతం పలకడాన్ని చూసి బానో మనసు ముక్కలై ఉంటుందన్నారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని దోషుల విడుదల నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చర్యలు చేపట్టి, చట్టాలపై విశ్వాసాన్ని, మానవత్వాన్ని కాపాడాలని సీజేఐను కవిత కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం