పంజాబ్ కాంగ్రెస్లో ఆశ్చర్యకర పరిణామం.. పీఎంను కలిసిన ఎంపీ బిట్టు
కాంగ్రెస్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. నవజ్యోత్ సింగ్ సిద్ధూ తరువాత పీసీసీ అధ్యక్షుడు ఎవరనే మంతనాలు కొనసాగుతున్న నేపథ్యంలో లుథియానా ఎంపీ రావనీత్ బిట్టు సోమవారం పీఎం నరేంద్ర మోదీని కలవడం అనేక సందేహాలకు దారితీస్తోంది.
దిల్లీ : పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. నవజ్యోత్ సింగ్ సిద్ధూ తరువాత పీసీసీ అధ్యక్షుడు ఎవరనే మంతనాలు కొనసాగుతున్న నేపథ్యంలో పార్టీ సీనియర్ నేత, లుథియానా ఎంపీ రవ్నీత్ బిట్టు సోమవారం పీఎం నరేంద్ర మోదీని కలవడం అనేక ప్రశ్నలకు దారితీస్తోంది. అధ్యక్షుడు ఎవరనే విషయాన్ని నిర్ణయించడానికి పార్టీ ఎంపీలతో సోనియా గాంధీ దిల్లీలో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో రేస్లో ఉన్న ఎంపీ బిట్టు ప్రధానిని కలిసిన ఫోటోలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు.
రానున్న లోక్సభ ఎన్నికల్లో పార్టీ తరపున టికెట్టు రాకపోయినా, పీసీసీ అధ్యక్షుడి పదవి దక్కకపోయినా రాజకీయ భవిష్యత్ ఇబ్బందుల్లో పడే ప్రమాదముందని, దాన్ని ముందుగానే ఊహించి భాజపాలో చేరేందుకే ప్రధానిని కలిసినట్లు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వారంలో పీసీసీ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. రవ్నీత్ బిట్టు, సుఖ్జిందర్ రణ్దావా, అమరీందర్ రాజా అధ్యక్షుడి రేస్లో ఉన్నారు. సుఖ్పాల్ ఖైరాకు పదవీ కట్టబెట్టడం కోసం మాజీ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. సిద్దూ గత కొద్ది వారాలుగా పార్టీ సభ్యులతో సమావేశమవుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల మీద జరుగుతున్న దాడులను ఖండిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని