Congress: ప్రజా వ్యతిరేక విధానాలను ఎదిరించేందుకు కాంగ్రెస్తో చేయి కలపాలి: మాణిక్ రావ్ ఠాక్రే
రాష్ట్రంలో రెండు రోజులపాటు సాగే హాథ్ సే హాథ్ జోడో అభియాన్ (Haath Se Haath Jodo Abhiyan) పాదయాత్రలో పార్టీ ముఖ్య నేతలంతా పాల్గొంటారని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు అన్నారు. పాదయాత్రను విజయవంతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: తెలంగాణలో సోమవారం నుంచి హాథ్ సే హాథ్ జోడో అభియాన్ (Haath Se Haath Jodo Abhiyan) పాదయాత్రలు మొదలవుతాయని రాష్ట్ర కాంగ్రెస్ (congress) వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే (Manikrao Thakre) తెలిపారు. మూడు రోజులుగా హైదరాబాద్లోనే మకాం వేసిన ఠాక్రే.. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మేడారంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth reddy), స్థానిక ముఖ్య నాయకులు కలిసి పాదయాత్రలో పాల్గొంటారని తెలిపారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చేసిన ప్రధాన ప్రసంగాలను, భాజపా గడిచిన 8ఏళ్లలో దేశంలో చేసిన ప్రజావ్యతిరేక కార్యక్రమాలను ఛార్జ్ షీట్ రూపంలో జనంలోకి తీసుకెళ్తున్నట్లు వివరించారు.
కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అవినీతి, అక్రమాలు ప్రజా వ్యతిరేక విధానాలపై కూడా ఛార్జ్ షీట్ విడుదల చేశామని వాటన్నింటినీ జనంలోకి తీసుకెళ్తామని ఠాక్రే తెలిపారు. పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నందున ఆయా సభ్యులు వెసులుబాటు చూసుకుని పాదయాత్రలో పాల్గొంటారని చెప్పారు. రేవంత్ రెడ్డి పాదయాత్రలో పాల్గొంటున్నందున పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే అవకాశం లేదని పేర్కొన్నారు. నాయకులందరూ వారి వారి నియోజక వర్గాల్లో పాదయాత్రలు చేస్తారని, వారి వారి అవకాశాలను బట్టి ఇతర ప్రాంతాల్లో కూడా పాల్గొంటారన్నారు. పాదయాత్రలో జనంతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుంటారని తెలిపారు. ప్రతి ఇంటికీ హాథ్ సే హాథ్ జోడో పోస్టర్ను అంటించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎదిరించేందుకు కాంగ్రెస్తో చేయి కలపాలని కోరారు. హాథ్ సే హాథ్ జోడో అభియాన్ పాదయాత్రకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివస్తారని.. ఇది విజయవంతం అవుతుందని ఆయన అశాభావం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం