Andhra News: పవన్.. రాజకీయాల్లో ఉన్నారో లేదో ముందుగా తేల్చుకోండి: బొత్స
రాజకీయాల్లో ఉన్నారో.. లేదో.. ముందుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తేల్చుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. విధాన పరమైన అంశాల గురించి స్పందించని...
అమరావతి: రాజకీయాల్లో ఉన్నారో.. లేదో.. ముందుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తేల్చుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. విధాన పరమైన అంశాల గురించి స్పందించని వారి గురించి ఏం మాట్లాడలేమన్నారు. కొందరు వ్యక్తులు కొందరు మంత్రులపై వ్యక్తిగత దూషణకు దిగితే ఎవరూ హర్షించరనే విషయాన్ని తెలుసుకోవాలని పేర్కొన్నారు. సీఎం జగన్ ఎప్పుడైనా అలా వ్యక్తిగత విమర్శలకు దిగారా అని ప్రశ్నించారు. ‘‘తనకు రోడ్మ్యాప్, ఆలోచన, అవగాహన లేదని పవన్ ఒప్పుకున్నారు. ఏ వైకాపా నాయకుడు రౌడీయిజం చేశారో పవన్ చెప్పాలి. రౌడీలు, గూండాలు.. అనే పదాలు సినిమాల్లో వినేందుకు చాలా బాగుంటాయి. వైకాపాని అధికారం నుంచి ఎందుకు దించేయాలో పవన్ స్పష్టంగా చెప్పాలి. ఆయనకు ఓ విధానం లేదు కాబట్టే స్పష్టత లేకుండా మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రాన్ని ఎలా ఉద్ధరిస్తారో పవన్ చెప్పలేకపోయారు. ప్రజలకు పనికివచ్చే అంశం ఒక్కటీ పవన్ ఉపన్యాసంలో లేదు. ఇప్పటికీ వైకాపాకు ఎవరితోనూ ఎలాంటి పొత్తులు లేవు. ఎన్నికల సమయంలో ఎవరైనా కలిసి రావాలని భావిస్తే అప్పుడు జగన్ నిర్ణయం తీసుకుంటారు’’ అని బొత్స పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!