Andhra News: పవన్‌.. రాజకీయాల్లో ఉన్నారో లేదో ముందుగా తేల్చుకోండి: బొత్స

రాజకీయాల్లో ఉన్నారో.. లేదో.. ముందుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తేల్చుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. విధాన పరమైన అంశాల గురించి స్పందించని...

Updated : 16 Mar 2022 15:30 IST

అమరావతి: రాజకీయాల్లో ఉన్నారో.. లేదో.. ముందుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తేల్చుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. విధాన పరమైన అంశాల గురించి స్పందించని వారి గురించి ఏం మాట్లాడలేమన్నారు. కొందరు వ్యక్తులు కొందరు మంత్రులపై వ్యక్తిగత దూషణకు దిగితే ఎవరూ హర్షించరనే విషయాన్ని తెలుసుకోవాలని పేర్కొన్నారు. సీఎం జగన్‌ ఎప్పుడైనా అలా వ్యక్తిగత విమర్శలకు దిగారా అని ప్రశ్నించారు. ‘‘తనకు రోడ్‌మ్యాప్‌, ఆలోచన, అవగాహన లేదని పవన్‌ ఒప్పుకున్నారు. ఏ వైకాపా నాయకుడు రౌడీయిజం చేశారో పవన్‌ చెప్పాలి. రౌడీలు, గూండాలు.. అనే పదాలు సినిమాల్లో వినేందుకు చాలా బాగుంటాయి. వైకాపాని అధికారం నుంచి ఎందుకు దించేయాలో పవన్ స్పష్టంగా చెప్పాలి. ఆయనకు ఓ విధానం లేదు కాబట్టే స్పష్టత లేకుండా మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రాన్ని ఎలా ఉద్ధరిస్తారో పవన్‌ చెప్పలేకపోయారు. ప్రజలకు పనికివచ్చే అంశం ఒక్కటీ పవన్ ఉపన్యాసంలో లేదు. ఇప్పటికీ వైకాపాకు ఎవరితోనూ ఎలాంటి పొత్తులు లేవు. ఎన్నికల సమయంలో ఎవరైనా కలిసి రావాలని భావిస్తే అప్పుడు జగన్ నిర్ణయం తీసుకుంటారు’’ అని బొత్స పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని