
విద్యుత్ సిబ్బందిపై చేయి చేసుకున్నవారిని గుర్తించండి!
డీజీపీతో మాట్లాడిన మంత్రి జగదీశ్ రెడ్డి
హైదరాబాద్: లాక్డౌన్ కొనసాగుతున్న వేళ విద్యుత్ సిబ్బందిని పోలీసులు ఆపొద్దని మంత్రి జగదీశ్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు డీజీపీ మహేందర్ రెడ్డితో ఆయన మాట్లాడారు. విద్యుత్ సిబ్బందిపై చేయి చేసుకున్న పోలీసులపై చర్యలకు మంత్రి ఆదేశించారు. చేయి చేసుకున్నవారిని గుర్తించాలని సూచించారు.అత్యవసర సర్వీసులకు ఆటంకం కల్పించొద్దని, పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. నల్గొండ సంఘటనలపై ఎస్పీతోనూ మంత్రి మాట్లాడారు. విద్యుత్ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
మరోవైపు, పోలీసుల తీరును నిరసిస్తూ విద్యుత్ ఉద్యోగులు నల్గొండలో ఆందోళనకు దిగారు. రెండు గంటల పాటు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.