Vemula Prashanth reddy: నడ్డా... ఇది కేసీఆర్ అడ్డా: మంత్రి వేముల
నాగర్ కర్నూల్ సభలో జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై ప్రశాంత్రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇక్కడి భాజపా నేతలు రాసిచ్చిన పాత స్క్రిప్టునే ఎన్నిసార్లు చదువుతారని ప్రశ్నించారు.
హైదరాబాద్: తెలంగాణకు వచ్చిన ప్రతిసారీ భాజపా నేతలు ఇక్కడి అభివృద్ధిపై విషం చిమ్మే మాటలే చెబుతున్నారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. పదే పదే అవే పచ్చి అబద్ధాలు వల్లెవేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇక్కడి నేతలు రాసిచ్చిన పాత స్క్రిప్టునే ఎన్నిసార్లు చదువుతారని ప్రశ్నించారు. నాగర్ కర్నూల్ సభలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై ప్రశాంత్రెడ్డి తీవ్రంగా స్పందించారు.
‘‘నడ్డా.. ఇది కేసీఆర్ అడ్డా. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందా? రెండు పడక గదుల ఇళ్ల కోసం మేం రూ.12వేల కోట్లు ఖర్చు పెట్టాం. వీటికి కేంద్రం కొసిరి కొసిరి ఇచ్చింది కేవలం రూ.1200 కోట్లే. కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలకు, అభివృద్ధి పనులకు కేంద్రంలోని భాజపా సర్కారు పైసలివ్వకున్నా.. అవార్డులు ఇస్తుంది తెలుసా? కేసీఆర్ రైతుబంధును కాపీ కొట్టి పెట్టిన కేంద్ర కిసాన్ సమ్మాన్ నిధిలో రైతులకు షరతులు విధించడం సిగ్గు చేటు. ధరణిని రద్దు చేసి మళ్లీ వీఆర్వో వ్యవస్థ తెచ్చి రైతులను గోస పెడదామనే ఆలోచన భాజపాది. కేసీఆర్ ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అని రైతులకు ఆసరాగా నిలబడితే.. భాజపా అరిగోస పెడుతోంది. పేదలు, రైతులు రెండు కళ్లుగా పని చేస్తున్న కేసీఆర్ని జైల్లో పెడతారా? పంచభూతాలను అమ్మకానికి పెట్టి, దేశ సంపద మిత్రులకు దోచి పెడుతున్న నరేంద్ర మోదీని ఎన్ని సార్లు జైల్లో పెట్టాలి?’’ అని మంత్రి వేముల విరుచుకుపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక ‘స్థానిక’ సందడి!
రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై కేంద్రీకృతం కానుంది. లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల సమరం ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. -
డీఎస్పీ చైతన్య యూనిఫాం తీసేసి.. వైకాపా కండువా వేసుకుంటే బెటర్: వర్ల రామయ్య
వైకాపా మూకలకు సహకరించి డీఎస్పీ చైతన్య... పోలీసు దుస్తులు తీసేసి, వైకాపా కండువా వేసుకోవాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
భారాస ధర్నాలు చేయడం తగదు
రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉండి రైతులను నిలువునా ముంచిన భారాస నేతలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ధర్నాలు నిర్వహించడం తగదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ విమర్శించారు. -
పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడడం దుర్మార్గం: సీపీఐ
పోలింగ్ అనంతరం రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు విఫలం కావడం విచారకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. -
అధికార పార్టీకి అనుకూలంగా సీఎస్: పాతూరి నాగభూషణం
ఈ ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నట్లు తెలిసినందువల్లే వైకాపా నేతలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని భాజపా మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం విమర్శించారు. -
రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలొద్దు
రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు తేల్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. -
అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి: సీపీఎం
క్వింటా వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో చెప్పిన వాగ్దానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని సీపీఎం కోరింది. -
అచ్చంపేట ఘటనలపై డీజీపీకి భారాస ఫిర్యాదు
అచ్చంపేటలో రౌడీయిజం పెరిగిపోయిందని, నయా నయీమ్ ముఠాలను చూస్తున్నామని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. -
‘దొడ్డు వడ్లకూ రూ.500 బోనస్ ఇవ్వాల్సిందే’
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు.. సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని భారాస నేతలు డిమాండ్ చేశారు. -
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
ఇండియా కూటమికి వెలుపలి నుంచే తమ మద్దతు ఇస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను నమ్మలేమని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ
-
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,365
-
తెదేపాకు ఓటేశాడని.. కొడవలితో చెవి కోసేశాడు
-
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM