చేతులు జోడించి అడుగుతున్నా: రోజా

కృష్ణా జలాల విషయంలో ఏపీకి అన్యాయం చేయొద్దని తెలంగాణ

Updated : 02 Jul 2021 13:40 IST

ఏపీకి అన్యాయం చేయొద్దని తెలంగాణకు విజ్ఞప్తి

తిరుమల: కృష్ణా జలాల విషయంలో ఏపీకి అన్యాయం చేయొద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌, వైకాపా ఎమ్మెల్యే రోజా కోరారు. ఈ విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని చేతులు జోడించి అడుగుతున్నట్లు చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు. విద్యుదుత్పత్తికి అక్రమంగా నీటి వినియోగం సరికాదని.. వివాద పరిష్కారానికి కేంద్రానికి ప్రభుత్వం లేఖ రాసినట్లు గుర్తుచేశారు. కృష్ణా జలాల వ్యవహారంలో రాష్ట్రానికి అన్యాయం చేస్తే సహించేది లేదని చెప్పారు. ఈ విషయంలో సీఎం జగన్‌ను విమర్శించడం సరికాదని రోజా అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని