Munugode By Polls: మునుగోడు ఫలితం.. రౌండ్ల వారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లంటే..!
మునుగోడు ఉప ఎన్నికల్లో తెరాస విజయదుందుబి మోగించింది. సమీప ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయం సాధించారు. రౌండ్ల వారీగా ఫలితాలను ఓసారి పరిశీలిస్తే..
ఇంటర్నెట్డెస్క్: మునుగోడు ఉప ఎన్నికల్లో తెరాస విజయదుందుబి మోగించింది. సమీప ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయం సాధించారు.తొలి మూడు రౌండ్లలో తెరాస, భాజపా మధ్య పోరు హోరాహోరిగా సాగినప్పటికీ క్రమంగా విజయం తెరాస చేతుల్లోకి వెళ్లిపోయింది. మొత్తం 15 రౌండ్లలో లెక్కింపు నిర్వహించారు. రౌండ్ల వారీగా ఫలితాలని ఓసారి పరిశీలిస్తే..
కీలకమైన చౌటుప్పల్ మండలంలోని ఓట్లను తొలి నాలుగు రౌండ్లలో లెక్కించారు. మొదటి రౌండ్లో తెరాస 6418 ఓట్లు సాధించగా, భాజపా 5,126, కాంగ్రెస్ 2100 ఓట్లు సాధించాయి. అయితే రెండు, మూడు రౌండ్లలో భాజపా ఆధిక్యం ప్రదర్శించింది. రెండో రౌండ్లో తెరాస 7,781 ఓట్లు సాధించగా, భాజపా 8,622, కాంగ్రెస్ 1,537 ఓట్లు సాధించాయి. మూడో రౌండ్లో తెరాస 7,390 ఓట్లు సాధించగా.. భాజపాకు 7,426, కాంగ్రెస్కు 1,926 ఓట్లు పోలయ్యాయి. దీంతో తొలి మూడు రౌండ్లు పూర్తయే సరికి తెరాస 415 ఓట్ల ఆధిక్యంలో నిలిచింది. అక్కడి నుంచి చివరి రౌండ్లో మినహా ప్రతి రౌండ్లోనూ గులాబీ పార్టీయే పై చేయి సాధించింది. క్రమంగా ఆధిక్యాన్ని పెంచుకుంటూ చివరికి10,309 ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగురవేసింది.
- నాలుగో రౌండ్లో తెరాస 4854 ఓట్లు సాధించగా, భాజపా 4555, కాంగ్రెస్ 1817 ఓట్లు సాధించాయి. నాలుగో రౌండ్ పూర్తయ్యేసరికి తెరాస 714 ఓట్ల ఆధిక్యంలో నిలిచింది.
- ఐదో రౌండ్లో తెరాసకు 6162, భాజపాకు 5245, కాంగ్రెస్కు 2683 ఓట్లు వచ్చాయి. దీంతో తెరాస 1631 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చింది.
- ఆరో రౌండ్లోనూ తెరాస పార్టీయే ఆధిక్యం ప్రదర్శించింది. ఈ రౌండ్లో తెరాస 6016 ఓట్లు సాధించగా, భాజపా 5378, కాంగ్రెస్ 1962 ఓట్లు సాధించాయి. ఆరు రౌండ్లు పూర్తయ్యే సరికి తెరాస ఆధిక్యం 2169కి చేరింది.
- ఏడో రౌండ్లో తెరాస 7202 ఓట్లు సాధించింది.భాజపాకు 6803, కాంగ్రెస్కు 1664 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి తెరాస 2555 ఓట్లు ఆధిక్యాన్ని ప్రదర్శించింది.
- ఎనిమిదో రౌండ్లో తెరాసకు 6620 ఓట్లు రాగా.. భాజపాకు 6088, కాంగ్రెస్కు 907 ఓట్లు పోలయ్యాయి. 8 రౌండ్లు పూర్తయ్యేసరికి తెరాస 3091 ఓట్ల ఆధిక్యంలో నిలిచింది. మొత్తం 8 రౌండ్లలో తెరాస 45,723, భాజపా 43,115, కాంగ్రెస్ 13,689 ఓట్లు సాధించాయి.
- తొమ్మిదో రౌండ్లోనూ తెరాస ఆధిక్యం ప్రదర్శించింది. గులాబీ పార్టీకి 7517 ఓట్లు రాగా.. భాజపా 6665, కాంగ్రెస్ 1684 ఓట్లు సాధించాయి. దీంతో తొమ్మిదో రౌండ్లో తెరాస 852 ఓట్ల ఆధిక్యం సాధించింది.
- పదో రౌండ్లో తెరాసకు 7503, భాజపాకు 7015, కాంగ్రెస్కు 1347 ఓట్లు వచ్చాయి. 10 రౌండ్లు పూర్తయ్యే సరికి తెరాస 4416 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చింది.
- 11వ రౌండ్లో తెరాస 7,214 ఓట్లు, భాజపా 5,853 ఓట్లు, కాంగ్రెస్ 1788 ఓట్లు సాధించాయి. మొత్తం 11 రౌండ్లు పూర్తయే సరికి తెరాస 67363, భాజపా 62923, కాంగ్రెస్ 17,627 ఓట్లు సాధించాయి. తెరాస 5,765 ఓట్ల అధిక్యంలో నిలిచింది.
- 12వ రౌండ్లోనూ తెరాస ఆధిక్యం ప్రదర్శించింది. ఈ రౌండ్లో తెరాసకు 7,448, భాజపాకు 5,448, కాంగ్రెస్కు 1828 ఓట్లు వచ్చాయి. 12 రౌండ్లు పూర్తయినప్పటికి తెరాస 7836 ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శించింది.
- 13వ రౌండ్తో తెరాస ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. 9136 ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఈ రౌండ్లో తెరాస 6691, భాజపా 5346, కాంగ్రెస్1206 ఓట్లు సాధించాయి.
- 14వ రౌండ్లోనూ తెరాస మరింత ఆధిక్యం దిశగా అడుగులు వేసింది. 14వ రౌండ్లో తెరాసకు 6612, భాజపాకు 5,557, కాంగ్రెస్కు 1206 ఓట్లు పోలయ్యాయి. 14వ రౌండ్లో తెరాస 1055 ఓట్ల ఆధిక్యం ప్రదర్శించింది.
- చివరి రౌండ్లో తెరాస 1270, భాజపా 1358, కాంగ్రెస్ 238 ఓట్లు సాధించాయి. ఈ రౌండ్లో భాజపా 88 ఓట్ల ఆధిక్యం ప్రదర్శించినప్పటికీ.. 15 రౌండ్లలో కలిపి తెరాస 10,113 మెజార్టీ సాధించింది. పోస్టల్ బ్యాలెట్లు, సర్వీసు ఓట్లతో కలిపి 10,309 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది.
రౌండ్ల వారీగా సాధించిన ఓట్లను పరిశీలిస్తే అధికార తెరాసకు భాజపా గట్టి పోటీ ఇచ్చిందనే చెప్పాలి. నియోజకవర్గంలో మొత్తం 2,41,805 ఓటర్లు ఉండగా.. పోలింగ్ రోజున రికార్డు స్థాయిలో 2,25,192 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. పోలైన మొత్తం ఓట్లలో తెరాస 97,006 ఓట్లు, భాజపా 86,697ఓట్లు, కాంగ్రెస్ 23,906 ఓట్లు సాధించాయి. 2014లో భాజపా-తెదేపా ఉమ్మడి అభ్యర్థి గంగిడి మనోహర్రెడ్డికి 27,434 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ 97,239 ఓట్లు, తెరాస 74,687 ఓట్లు, భాజపా అభ్యర్థి 12,725 ఓట్లు సాధించారు.
అప్పట్లో కాంగ్రెస్, సీపీఐ..ఇప్పుడు తెరాస
1952 నుంచి చిన్నకొండూరు నియోజకవర్గంపేరుతో ఉండగా కాంగ్రెస్ అభ్యర్థిగా నాటి స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు. 1967లో మునుగోడు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత నుంచి జరిగిన 12 ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరుసార్లు విజయం సాధించగా సీపీఐ అయిదు సార్లు నెగ్గింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక తొలి ఎన్నికల్లో తెరాస విజయం సాధించింది. కాంగ్రెస్ అగ్రనేత పాల్వాయి గోవర్ధన్రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి అయిదుసార్లు గెలవగా 2018లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి విజయం సాధించారు. సీపీఐ ముఖ్యనేత ఉజ్జిని నారాయణరావు 1985, 1989, 1994లలో గెలవగా పల్లా వెంకట్రెడ్డి 2004లో, ఉజ్జిని యాదగిరిరావు 2009లో విజయం సాధించారు. ఎక్కువ సార్లు కాంగ్రెస్, వామపక్షాల మధ్య పోటీ సాగింది. 1994లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన పాల్వాయి గోవర్ధన్రెడ్డి రెండో స్థానంలో నిలవగా 2014లో ఆయన కుమార్తె పాల్వాయి స్రవంతి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి రెండో స్థానంలో నిలిచారు. తాజా ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు