Yuvagalam: వైకాపా సైకోలకు జగన్ లైసెన్స్ : లోకేశ్
వైకాపా (YSRCP) పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) విమర్శించారు. యువగళంలో భాగంగా చిత్తూరులోని దళితులతో ఆయన మాట్లాడారు.
చిత్తూరు: గతంలో ఎన్నడూ లేనివిధంగా జగన్ (CM Jagan) పాలనలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) విమర్శించారు. చిత్తూరు జిల్లాలో యువగళం (Yuvagalam) పాదయాత్రలో భాగంగా సదకుప్పంలో పర్యటిస్తున్న ఆయన.. స్థానిక దళితులతో మాట్లాడారు. ఎస్సీలపై దాడులు పెరిగిపోవడానికి ముఖ్యమంత్రే కారణమని అన్నారు. ఎస్సీలపై దాడులు, హత్యలకు పాల్పడేందుకు వైకాపా సైకోలకు సీఎం జగన్ లైసెన్స్ ఇచ్చారంటూ దుయ్యబట్టారు. దళితులపైనే తిరిగి అట్రాసిటీ కేసులు పెట్టిన ఉదంతాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా? అని లోకేశ్ ప్రశ్నించారు. పాదయాత్రను అడ్డుకోవాలనుకుంటే..చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
తెదేపా నాయకుల సంబరాలు
నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర శుక్రవారం 100 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నంద్యాల జిల్లా తెదేపా అధ్యక్షుడు గౌరు వెంకట్ రెడ్డి ఇంటి ఎదుట పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. వంద కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయ్యే లోపే... ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలు బయటకు వచ్చారని, పాదయాత్ర పూర్తయ్యేనాటికి ఒక్క ఎమ్మెల్యే కూడా వైకాపాలో మిగలరని ఈ సందర్భంగా పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుందని గౌరు వెంకట్రెడ్డి తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ స్పందించి పాదయాత్రకు ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం