Nara Lokesh: ఇది నవశకం.. యుద్ధం మొదలైంది: నారా లోకేశ్‌

ఇది నవశకం యుద్ధం మొదలైంది.. తాడేపల్లి తలుపులు బద్దలుకొట్టే వరకు ఈ యుద్ధం ఆగదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. 

Updated : 20 Dec 2023 22:34 IST

నెల్లిమర్ల: ఇది నవశకం.. యుద్ధం మొదలైందని, తాడేపల్లి తలుపులు బద్దలుకొట్టే వరకు ఈ యుద్ధం ఆగదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. యువగళం-నవశకం సభలో ఆయన మాట్లాడారు. ‘‘ప్రజలు పాదయాత్ర చేస్తే పోరాటం అవుతుంది. రాక్షస పాలనలో పోరాటం చేస్తే విప్లవం అవుతుంది. యువగళం.. మనగళం.. ప్రజాగళం. జగన్‌ది రాజారెడ్డి రాజ్యాంగం పొగరు. లోకేశ్‌ది అంబేడ్కర్‌ రాజ్యాంగం పౌరుషం. యువగళం ముగింపు సభ కాదు.. ఆరంభం మాత్రమే. చంద్రబాబు, పవన్‌ను చూస్తే జగన్‌ భయపడతారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించారు. విజనరీ అంటే చంద్రబాబు.. ప్రిజనరీ అంటే జగన్‌. జగన్‌ అరెస్టు అయితే రోజుకో స్కాము బయటపడేది. ప్రజాస్వామ్యాన్ని జగన్‌ దెబ్బతీశారు. రూ.లక్ష కోట్లు దోచేసిన వ్యక్తి పేదవాడు అవుతారా? జగన్‌ అహంకారం.. ప్రజల ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం జరుగుతోంది. మూడు నెలల్లో ప్రజాస్వామ్యం పవర్ ఏంటో చూపాలి.

బెట్టింగ్‌ స్టార్‌ అనిల్‌ .. అరగంట స్టార్‌ అంబటి...

ఆడుదాం ఆంధ్రా అంటూ కొత్త పథకం తెచ్చారు. మా జీవితాలతో ఆడారని ప్రజలు చెబుతున్నారు. జగన్‌ ఐపీఎల్‌ టీమ్‌ పేరు కోడికత్తి వారియర్స్‌.  కోడికత్తి వారియర్స్‌ ఆటగాడు అవినాష్‌రెడ్డి. బెట్టింగ్‌ స్టార్‌ అనిల్‌ యాదవ్‌.. అరగంట స్టార్‌ అంబటి. గంట స్టార్‌ అవంతి.. ఆల్‌ రౌండర్‌ గోరంట్ల మాధవ్‌. రీల్‌ స్టార్‌ భరత్‌.. పించ్‌ హిట్టర్‌ బియ్యపు మధుసూదన్‌రెడ్డి. యువగళం పాదయాత్ర ఎన్నో పాఠాలు నేర్పింది. అడుగడుగునా జగన్‌ విధ్వంసం కనిపించింది. రాజధానిని చంపి జగన్‌ రాక్షసానందం పొందారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని సరైన గాడిలో పెడతాం’’ అని లోకేశ్‌ వివరించారు. లోకేశ్‌ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా ‘యువగళం-నవశకం’ పేరుతో తెదేపా భారీ బహిరంగ సభ నిర్వహించింది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లి వద్ద ఏర్పాటు చేసిన సభకు రాష్ట్ర నలుమూలల నుంచి తెదేపా, జనసేన శ్రేణులు భారీగా తరలివచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని