Pawan Kalyan: పిఠాపురం నుంచే విజయకేతనం.. ఉగాది వేడుకల్లో పవన్‌

జనసేన (Janasena) అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులో నిర్వహించిన ఉత్సవాలకు సోదరుడు నాగబాబు, జనసేన నేతలతో కలిసి హాజరయ్యారు.

Updated : 09 Apr 2024 12:16 IST

గొల్లప్రోలు: జనసేన (Janasena) అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులో నిర్వహించిన ఉత్సవాలకు సోదరుడు నాగబాబు, తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన నేతలతో కలిసి హాజరయ్యారు. పవన్‌కు వేదపండితులు ఆశీర్వచనం అందించారు. 

అనంతరం పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ ప్రజలంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. పిఠాపురం నుంచే విజయకేతనం ఎగురవేయబోతున్నామని.. క్రోధి నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామన్నారు. ఈ ఏడాది ప్రజలకు మేలు జరగాలని..  రైతులు, మహిళలకు మరింత ప్రోత్సాహం లభించాలన్నారు. ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు రావాలని ఆకాంక్షించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని