Punjab Politics: మధ్యాహ్నానికి పంజాబ్ కొత్త సీఎం పేరు ఖరారు?
అమరీందర్ వారసుణ్ని ఎన్నుకునేందుకు నేడు కాంగ్రెస్ శాసనసభాపక్షం మరోసారి భేటీ కానుందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మధ్యాహ్నానానికి కొత్త సీఎం పేరు ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం...
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేయడంతో ఆ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తిగా మారాయి. తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో అమరీందర్ వారసుణ్ని ఎన్నుకునేందుకు నేడు కాంగ్రెస్ శాసనసభాపక్షం మరోసారి భేటీ కానుందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మధ్యాహ్నానికి కొత్త సీఎం పేరు ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మరోవైపు నూతన సీఎం ఎంపిక బాధ్యత అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతిలో ఉందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నారు.
నూతన పగ్గాలు ఎవరికో?
నూతన సీఎం రేసులో ప్రధానంగా నలుగురి పేర్లు వినిపిస్తున్నాయి. పీసీసీ మాజీ అధ్యక్షులు సునీల్ జాఖడ్, ప్రతాప్ సింగ్ బజ్వా, తాజా మాజీ మంత్రి సుఖ్జీందర్ సింగ్ రంధ్వా, మాజీ సీఎం రాజేందర్ కౌర్ భట్టల్లలో ఒకరిని ఎంపిక చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు మాజీ ముఖ్యమంత్రి బేయంత్ సింగ్ మనవడు రన్వీత్ సింగ్, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ పేరు కూడా వినవస్తోంది. అయితే, సీఎంగా రాజీనామా చేసిన తర్వాత అమరీందర్.. సిద్ధూపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఆయన్ని సీఎంని చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదన్నారు. ఆయన సీఎం కావడం పంజాబ్కు నష్టదాయకమని విరుచుకుపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం