Rahul Gandhi: తేజస్వీ జీపులో రాహుల్ యాత్ర..!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ యాత్రలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పాల్గొన్నారు. వీరిద్దరూ కలిసి జీపులో ప్రయాణించి కార్యకర్తలను ఉత్సాహపరిచారు.
ఇంటర్నెట్డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వీ యాదవ్ శుక్రవారం పాల్గొన్నారు. సాసారామ్లో జరిగిన ఈ యాత్రకు ఆర్జేడీ నేత ఎరుపు రంగు జీప్ రాంగ్లర్ వాహనంలో వచ్చారు. ఈ సందర్భంగా రాహుల్, ఇతర కీలక నాయకులు ఆ వాహనంలో ఎక్కగా తేజస్వీ స్వయంగా డ్రైవింగ్ చేసి ఇరు పార్టీల కార్యకర్తలను ఉత్సాహపరిచారు. అక్కడ యాత్ర జరిగినంత సేపు ఆయన వాహనాన్ని నడపడం గమనార్హం. ఈ ఫొటోలను తేజస్వీ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. సాసారామ్లో భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభం అని క్యాప్షన్ జత చేశారు. జేడీయూ-ఆర్జేడీ బంధం ముగిశాక వీరిద్దరూ కలిసి ప్రచారంలో పాల్గొనడం ఇదే తొలిసారి.
తిరగబడతారో.. బానిసలుగా మిగిలిపోతారో!
బిహార్లో ఈ యాత్ర ప్రస్తుతం తుది దశకు చేరింది. నేటి సాయంత్రానికి ఉత్తర్ప్రదేశ్లోకి ప్రవేశించనుంది. ‘‘భారత్ జోడో న్యాయ్ యాత్ర నేడు 34వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ రోహ్తాస్లో రైతు నాయకులతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 2.30కు తేజస్వీ, రాహుల్ కలిసి కైముర్లోని బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఈ యాత్ర యూపీలోకి ప్రవేశిస్తుంది’’ అని ఆ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్ తెలిపారు.
ఈ యాత్రలో భాగంగా గురువారం రాత్రి బిహార్ నుంచి ఉత్తర్ప్రదేశ్ సరిహద్దుకు చేరుకున్న రాహుల్గాంధీ బృందం ఓ ప్రభుత్వ కళాశాలలో రాత్రిబస చేసేందుకు జిల్లా అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో భదోహీ పొలాల్లో బస చేశారు. శని, ఆదివారాల్లో జరగనున్న పోలీసు నియామక పరీక్షకు ఎంపిక చేసిన కేంద్రాల్లో ఆ కళాశాల కూడా ఉన్నందున అనుమతి నిరాకరించినట్లు ఏఎస్పీ రాజేశ్ భారతి వివరణ ఇచ్చారు. రాహుల్ బసకు అధికారుల నుంచి తాము ముందే అనుమతి కోరినా, కావాలనే నిరాకరించినట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేంద్రకుమార్ దూబే ఆరోపించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల మీదుగా 785 కిలోమీటర్ల మేర ఏడు రోజులపాటు యాత్ర కొనసాగనుంది. నేడు యూపీలో మొదలయ్యే యాత్ర.. ఫిబ్రవరి 25 తేదీ వరకు జరుగుతుంది. మధ్యలో 22, 23 తేదీల్లో విరామం ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం