తిరగబడతారో.. బానిసలుగా మిగిలిపోతారో!
వైకాపా పాలనలో అయిదేళ్ల నరకం నుంచి విముక్తి పొందడానికి తిరగబడతారో, బానిసలుగా మిగిలిపోతారో ప్రజలే తేల్చుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఎన్నికలకు ఇక 54 రోజులే సమయం
అయిదేళ్ల ‘విధ్వంసం’పై ఇంటింటా చర్చించాలి
ముఖ్యమంత్రి మానసిక అనారోగ్యం వల్లే ఈ దుస్థితి
‘విధ్వంసం’ పుస్తకావిష్కరణ సభలో చంద్రబాబు
ఈనాడు, అమరావతి: వైకాపా పాలనలో అయిదేళ్ల నరకం నుంచి విముక్తి పొందడానికి తిరగబడతారో, బానిసలుగా మిగిలిపోతారో ప్రజలే తేల్చుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘ఎన్నికలకు సమయం 54 రోజులే.. నేను, పవన్కల్యాణ్ మా బాధ్యతగా పోరాడతాం. రాష్ట్ర భవిష్యత్తు ను ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మాతో కలిసి నడవాలి’ అని విజ్ఞప్తి చేశారు. 2019-24 ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సీనియర్ జర్నలిస్టు ఆలపాటి సురేశ్కుమార్ రాసిన ‘విధ్వంసం’ పుస్తకావిష్కరణ సభకు విశాలాంధ్ర దినపత్రిక సంపాదకులు ఆర్వీ రామారావు అధ్యక్షత వహించగా.. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్కల్యాణ్, సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘ప్రభుత్వాన్ని, సమాజాన్ని దగ్గరి నుంచి గమనించిన జర్నలిస్టు ధర్మాగ్రహం ఇది. 5కోట్ల మంది మనసుల్లో ఏముందో ఈ పుస్తకంలో చెప్పారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేలా సురేశ్కుమార్ దీన్ని రచించారు. ఈ పుస్తకం ఒక ఆయుధం. అయిదేళ్ల నరకాన్ని రాబోయే 54 రోజులూ చర్చించాలి. ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం తేవాలి. చొక్కా చేతులు మడతపెట్టే సమయం వచ్చిందని సీఎం జగన్ ఒక సభలో చెప్పారట.. మీరు, మీ వైకాపా కార్యకర్తలు చొక్కా చేతులు మడిస్తే.. తెదేపా కార్యకర్తలు, జనసైనికులు, ప్రజలూ కలిసి కుర్చీలు మడతపెట్టి మీకు కుర్చీ లేకుండా చేస్తారు. ఎన్నికలంటే ద్వంద్వయుద్ధం కాదు. ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండండి. మంచికీ హద్దులు ఉంటాయి’ అని హెచ్చరించారు.
నాలుగో రాజధాని అంటున్నారు.. సిగ్గూ, ఎగ్గూ ఉందా?
అధికారంలోకి వస్తే హైదరాబాద్ను రాజధానిగా కొనసాగించాలని కోరతామంటున్న ఈ ప్రభుత్వానికి సిగ్గూ, ఎగ్గూ ఉందా? అని చంద్రబాబు మండిపడ్డారు. ‘అయిదేళ్లుగా మూడు రాజధానులని చెప్పి అమరావతి అభివృద్ధిని వదిలేశారు. రూ.2 లక్షల కోట్ల ఆదాయాన్నిచ్చే రాజధానిని విధ్వంసం చేశారు. ఇప్పుడు మళ్లీ మేమే వస్తాం, నాలుగో రాజధాని కోసం పోరాడతామంటే.. ఎంత నీచం? ఈ అరాచకానికి ఏ పేరు పెట్టాలి? ఇదే సైకో విధానం’ అని దుయ్యబట్టారు. అమరావతి మహిళా రైతులకు ‘విధ్వంసం’ పుస్తకాన్ని అంకింతమిచ్చిన సురేశ్కుమార్ను చంద్రబాబు అభినందించారు. ఇలాంటి దుర్మార్గుడి పాలన వస్తుందంటే.. అప్పట్లో రాజధానికి 35వేల ఎకరాలను 29వేల మంది రైతులు ఇచ్చేవారు కాదని చెప్పారు. అమరావతి మహిళలు అనుభవించిన బాధ, వేధింపులు శత్రువుకు కూడా రాకూడదన్నారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేయడానికి సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రజలు సైకో అంటున్నారంటే ఆయన మానసిక పరిస్థితి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘ప్రజలకు సమస్య వస్తే ప్రభుత్వానికి, సీఎంకు చెబుతారు. ప్రభుత్వమే సమస్య అయితే ఎవరి దగ్గరకు పోవాలి? ముఖ్యమంత్రి మానసిక అనారోగ్యంతోనే ఈ పరిస్థితి వచ్చింది’ అని చంద్రబాబు విమర్శించారు.
ఇన్ని పాపాలు చేశానా అని జగన్ అనుకుంటారు
- కె.రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
పాపాలు చేసిన జగన్, పోరాడిన మేము కూడా చాలా ఘటనలను మర్చిపోయి ఉంటాం. కానీ ఈ పుస్తకంలో వివరించారు. ఇంకొన్ని రోజుల తర్వాత జగన్ పదవి పోతుంది. అప్పుడు ఈ పుస్తకాన్ని తీరిగ్గా చదువుతూ, ఇన్ని పాపాలు చేశానా అని ఆయనే ఆశ్చర్యపోతారు. వందకోట్ల మద్యం కుంభకోణంలో దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఏడాదిగా జైల్లో ఉంచారు. అలాగైతే రాష్ట్రంలో మద్యం ద్వారా రూ.వేల కోట్ల దోపిడీ చేస్తున్న జగన్ను వెయ్యేళ్లు జైల్లో పెట్టాలి.
ప్రతి వ్యవస్థనూ ఈ ప్రభుత్వం విధ్వంసం చేసింది
- ఆలపాటి సురేశ్కుమార్, పుస్తక రచయిత
అధికారమే పరమావధిగా రాష్ట్రంలో జగన్ పాలన సాగుతోంది. అధికారాన్ని కాపాడుకోవడానికి ప్రకృతి వనరులన్నింటినీ దోచేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న ప్రతి వ్యవస్థనూ వైకాపా ప్రభుత్వం ధ్వంసం చేసింది. వాటన్నింటినీ సవివరంగా పుస్తకంలో పెట్టాను. వాస్తవాలను వక్రీకరించే కర్మాగారాలు పుట్టుకొచ్చాక వార్తలకు, వాస్తవాలకు విలువ లేకుండా పోయింది. ఒక పాత్రికేయుడిగా నేను ప్రజా ప్రయోజనానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తా. 2019 నుంచి నేటివరకు జగన్ చేసిన కక్ష సాధింపు, ప్రజావ్యతిరేక, అరాచక పాలన గురించి ఈ పుస్తకంలో పొందుపరిచాను.
ఎన్నికల వేళ నాలుగో రాజధాని
- శివారెడ్డి, అమరావతి పరిరక్షణ సమితి
ఈ అయిదేళ్లు మూడు రాజధానులు కట్టలేని వీరు.. ఎన్నికలు సమీపిస్తుండటంతో నిస్సిగ్గుగా మళ్లీ హైదరాబాద్ రాజధాని అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. తెదేపా, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ల సారథ్యంలో ఈ అరాచక ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నాం.
చంద్రబాబు, పవన్కల్యాణ్ వెంట నడుద్దాం
- పోతుల బాలకోటయ్య, అమరావతి బహుజన ఐకాస
ప్రజావేదికను కూల్చేసిన జగన్. దాని శకలాలను కూడా తీయించకుండా రాక్షసానందం పొందుతున్నారు. జగన్ పాలనలో దళితుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రాజధాని లేని రాష్ట్రంగా దేశంలో పరువు పోయేలా చేశారు. కృష్ణార్జునుల్లా ఉన్న చంద్రబాబు, పవన్కల్యాణ్ల వెంట ఉండి ఈ దుర్మార్గ పాలనను అంతమొందించాలి.
దళితుల గురించి మాట్లాడే హక్కు జగన్కు లేదు
- ముప్పాళ్ల సుబ్బారావు, సీనియర్ న్యాయవాది
రాష్ట్రంలో నిరసన తెలిపే స్వాతంత్య్రం ప్రజలకు లేదు. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ఆందోళనలకు పిలుపునిస్తే అక్రమ నిర్బంధాలకు గురిచేస్తున్నారు. చీకటి జీవోలు తీసుకొచ్చి పాత్రికేయులపై ఆంక్షలు పెడుతున్నారు. పోలీసులను, విచారణ సంస్థలను ఉపయోగించుకుని రాజ్యహింస చేస్తున్నారు. దళితుల గురించి మాట్లాడే హక్కు జగన్కు లేదు.
తప్పులను నివారించాలి
- ఆర్వీ రామారావు, సంపాదకులు, విశాలాంధ్ర దినపత్రిక
‘విధ్వంసం’ పుస్తకం ద్వారా సురేశ్కుమార్.. అయిదేళ్ల పాలనను రికార్డు చేసే ప్రయత్నం చేశారు. చరిత్ర నుంచి స్ఫూర్తి పొందడంతో పాటు అందులోని తప్పులనూ నివారించాలి. రాజకీయాలను ఈసడించుకున్నంత మాత్రాన.. వాటి ప్రభావం మనపై పడకుండా పోదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తొలగింపు
Mayawati: డిసెంబర్లో తన రాజకీయ వారసుడిగా మాయావతి తన మేనల్లుడైన ఆకాశ్ ఆనంద్ను ప్రకటించారు. తాజాగా కీలక బాధ్యతల నుంచి ఆయన్ని తొలగిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టం.. రైతుల భూముల్ని కొల్లగొట్టేందుకే
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దొడ్డిదారిన అమలు చేసేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని ఎన్డీయే నేతలు విమర్శించారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు?
ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. -
నూర్బాషాల సంక్షేమానికి కూటమి మ్యానిఫెస్టోలో రూ.100 కోట్లు కేటాయిస్తామనడం హర్షనీయం
నూర్బాషాల సంక్షేమానికి రూ.వంద కోట్లు కేటాయిస్తామని తెదేపా, జనసేన మ్యానిఫెస్టోలో చెప్పడం హర్షనీయమని తెదేపా నూర్ బాషా నాయకులు నాగుల్మీరా, పీర్ మహ్మద్బుజ్జి, షేక్ సుభాని, నాగుల్ అన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు ఉరితాడే
రాష్ట్రంలోని ఇసుక, గనులతో పాటు అన్ని సహజవనరులను దోచుకున్న సీఎం జగన్ ఇప్పుడు ప్రజల ఆస్తులపై కన్నేశారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. -
హరియాణా రాజకీయాల్లో కలకలం
హరియాణాలో అధికార భాజపా ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి తాము మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు మంగళవారం ప్రకటించారు. -
అయిదో రోజు మరో ఏడుగురు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వంలో ఐదో రోజు మంగళవారం మరో ఏడుగురు అభ్యర్థులు కొత్తగా నామినేషన్ వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ.. కోడె మొక్కులు చెల్లింపు
-
ఇజ్రాయెల్కు భారీ షాకిచ్చిన అమెరికా.. కీలక ఆయుధ సరఫరా నిలిపివేత
-
గిరాకీ తగ్గింది.. టీకాను మార్కెట్ నుంచి వెనక్కు తీసుకుంటున్నాం: ఆస్ట్రాజెనెకా
-
చంద్రబాబు బెయిల్ రద్దు కేసు పది వారాలు వాయిదా
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,276
-
ఏపీ సీఎస్ ఉదాసీనతతో పండుటాకులకు పాట్లు