తక్షణమే ఆ చట్టాలను రద్దు చేయండి: రాహుల్
నూతన వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్విటర్ ద్వారా స్పందించారు. కేంద్ర వ్యవసాయ చట్టాలను రైతు వ్యతిరేక చట్టాలుగా రాహుల్ పేర్కొన్నారు.
దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్విటర్ ద్వారా స్పందించారు. కేంద్ర వ్యవసాయ చట్టాలను రైతు వ్యతిరేక చట్టాలుగా రాహుల్ పేర్కొన్నారు. ‘వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని మరోసారి నేను నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కోరుతున్నా’ అని ట్వీట్లో విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ చెప్పిన ఓ సూక్తిని రాహుల్ ప్రజలతో పంచుకున్నారు. ‘సున్నితమైన మార్గంలో మీరు ప్రపంచాన్ని కదిలించవచ్చు’ అనే సూక్తిని ట్వీట్లో షేర్ చేశారు.
రాజకీయాలు చేయొద్దు: ఫడణవీస్
దిల్లీలో గణతంత్ర దినోత్సవం రోజున రైతుల ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తత అంశంపై ఎవరూ రాజకీయాలు చేయవద్దని మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ విజ్ఞప్తి చేశారు. ఈ అంశం దేశానికి సంబంధించింది.. కాబట్టి రాజకీయాలు చేయవద్దని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ మీడియాతో వెల్లడించారు. ఈ సందర్భంగా ఫడణవీస్ రైతుల ఆందోళనలు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీయడాన్ని తీవ్రంగా ఖండించారు. ‘దేశ రాజధాని దిల్లీలో నిన్న జరిగిన ఘటన సరైంది కాదు. కాబట్టి ఆ హింసాత్మక ఘటనలపై ఎవరూ రాజకీయాలు చేయరు అని నేను భావిస్తున్నా. ఈ హింసాత్మక ఘటనలతో రైతుల ఆందోళనలు విశ్వాసాన్ని కోల్పోయాయి. ఇందుకు దారి తీసిన పరిస్థితులపై నిరసనలకు నాయకత్వం వహించిన రైతు సంఘాల నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి’ అని సూచించారు.
కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గణతంత్ర దినోత్సవం రోజున రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. రైతులు ఎర్రకోటపై రైతు జెండాలను ఎగురవేశారు. ఈ ఘటనలో 300 మంది పోలీసులకు గాయాలైనట్లు దిల్లీ పోలీసు శాఖ వెల్లడించింది. ఘటనకు బాధ్యులుగా అనుమానిస్తున్న 200 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 22 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!