Sajjala: అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తుందనే వార్తలు ఊహాజనితమే: సజ్జల
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎక్కడికో పారిపోతున్నట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అసహనం వ్యక్తం చేశారు.
అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎక్కడికో పారిపోతున్నట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. కన్న తల్లికి అనారోగ్యంగా ఉందని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం అవినాష్ రెడ్డికి లేదన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద సజ్జల మీడియాతో మాట్లాడారు.
‘‘సీబీఐ ముందు విచారణకు హాజరయ్యేందుకే అవినాష్ రెడ్డి హైదరాబాద్ వెళ్లారు. సీబీఐ అధికారులు పిలిచిన ప్రతిసారి అవినాష్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఇవాళ తన తల్లి ఆరోగ్యం బాగోలేదని తెలిసి హైదరాబాద్ నుంచి పులివెందులకు బయలుదేరారు. ఊహించని విధంగా ఇవన్నీ జరిగిపోయాయి. అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తుందనే వార్తలు కేవలం ఊహాజనితాలు మాత్రమే. మరోసారి సీబీఐ విచారణకు హాజరయ్యేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. వివేకా హత్య కేసులో అవినాష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఆయన రేపైనా సీబీఐ విచారణకు హాజరవుతారు.. హాజరు కావాల్సిందే. వివేకానందరెడ్డిని నరికిన వ్యక్తి మీడియా సమావేశాలు పెడుతున్నారు. బెయిల్ తీసుకుని స్వేచ్ఛగా తిరుగుతున్నారు. వివేకా హత్య కేసుతో ఎలాంటి సంబంధం లేని వారిని వేధిస్తున్నారు. దర్యాప్తు విషయంలో సీబీఐకి సహకరిస్తోన్న ఒక బాధ్యతగల ఎంపీ విషయంలో ఇలా ప్రవర్తిస్తున్నారు. తల్లి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని చిత్రీకరించే దౌర్భాగ్యం అవినాష్కు లేదు’’ అని సజ్జల అన్నారు.
అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు వదిలేవారా?
‘‘అవినాష్ రెడ్డి ఎక్కడికో పారిపోతున్నట్లుగా ఓ మీడియా సంస్థకు చెందిన వాహనం వెంబడించింది. ఆయనను నేరస్థుడిగా చూపే విధంగా ప్రయత్నించడం సరికాదు. అయినప్పటికీ మీడియా సంస్థకు చెందిన వాహనంపై దాడి జరగడం దురదృష్టకరం. దాడి విషయం అవినాష్కు తెలిసి ఉండకపోవచ్చు. వివేకా హత్యలో అవినాష్ రెడ్డి ప్రమేయం ఉంటే అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు వదిలేవారా? హత్య అనంతరం రక్తపు మరకలు ఎవరు తుడిచారో అందరికీ తెలుసు. వివేకా రాసినట్లు చెబుతోన్న లేఖను ఎవరు.. ఎందుకు.. దాచారో కూడా ఇప్పటికే బహిర్గతం అయింది. చంద్రబాబు హయాంలో వివేకా హత్య కేసు అనుమానితులను ఎందుకు అరెస్టు చేయలేదు? తప్పు చేసిన వారు ఎవరూ తప్పించుకోలేరు. అసలు విషయం వెలుగులోకి వచ్చేలోగా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం సరైంది కాదు’’ అని సజ్జల వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక ‘స్థానిక’ సందడి!
రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై కేంద్రీకృతం కానుంది. లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల సమరం ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. -
డీఎస్పీ చైతన్య యూనిఫాం తీసేసి.. వైకాపా కండువా వేసుకుంటే బెటర్: వర్ల రామయ్య
వైకాపా మూకలకు సహకరించి డీఎస్పీ చైతన్య... పోలీసు దుస్తులు తీసేసి, వైకాపా కండువా వేసుకోవాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
భారాస ధర్నాలు చేయడం తగదు
రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉండి రైతులను నిలువునా ముంచిన భారాస నేతలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ధర్నాలు నిర్వహించడం తగదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ విమర్శించారు. -
పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడడం దుర్మార్గం: సీపీఐ
పోలింగ్ అనంతరం రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు విఫలం కావడం విచారకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. -
అధికార పార్టీకి అనుకూలంగా సీఎస్: పాతూరి నాగభూషణం
ఈ ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నట్లు తెలిసినందువల్లే వైకాపా నేతలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని భాజపా మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం విమర్శించారు. -
రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలొద్దు
రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు తేల్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. -
అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి: సీపీఎం
క్వింటా వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో చెప్పిన వాగ్దానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని సీపీఎం కోరింది. -
అచ్చంపేట ఘటనలపై డీజీపీకి భారాస ఫిర్యాదు
అచ్చంపేటలో రౌడీయిజం పెరిగిపోయిందని, నయా నయీమ్ ముఠాలను చూస్తున్నామని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. -
‘దొడ్డు వడ్లకూ రూ.500 బోనస్ ఇవ్వాల్సిందే’
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు.. సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని భారాస నేతలు డిమాండ్ చేశారు. -
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
ఇండియా కూటమికి వెలుపలి నుంచే తమ మద్దతు ఇస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను నమ్మలేమని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ
-
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,365
-
తెదేపాకు ఓటేశాడని.. కొడవలితో చెవి కోసేశాడు
-
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM