Smriti Irani: ఓటమిని ముందే అంగీకరించారు.. రాహుల్కు స్మృతీ ఇరానీ కౌంటర్
అమేఠీ ప్రజల తీర్పును ముందే ఊహించిన కాంగ్రెస్ తమ అభ్యర్థిని ప్రకటించే ధైర్యం చేయలేకపోతోందని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ విమర్శించారు.
అమేఠీ: లోక్సభ ఎన్నికల్లో (LokSabha Elections 2024) అమేఠీలో భాజపా (BJP) విజయం ఖాయమైందని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ (Smriti Irani) ధీమా వ్యక్తం చేశారు. ప్రజల తీర్పును ఊహించిన కాంగ్రెస్ (Congress) అభ్యర్థిని ప్రకటించకుండా తాత్సారం చేస్తుందని ఎద్దేవా చేశారు. గురువారం నియోజకవర్గంలో రూ.206 కోట్ల విలువైన 281 ప్రాజెక్టులకు ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
‘‘అమేఠీ నియోజకవర్గం గాంధీ కుటుంబం కంచుకోట అని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోంది. అది నిజమే అయితే, ఇప్పటిదాకా ఆ పార్టీ అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదు? ప్రజల తీర్పు ఏంటో వాళ్లకి బాగా తెలుసు. అందుకే అభ్యర్థిని ప్రకటించే ధైర్యం చేయలేకపోతోంది. ఇది ఆ పార్టీ ఓటమికి స్పష్టమైన సంకేతం. రాహుల్ గాంధీ రెండు చోట్లా పోటీ చేస్తున్నారంటే.. ఎన్నికలకు ముందే అమేఠీలో ఓటమిని అంగీకరించినట్లే. ఆయనకు ధైర్యం ఉంటే మాయావతి, అఖిలేశ్ యాదవ్ మద్దతు లేకుండా ఒంటరిగా ఇక్కడ నుంచి పోటీ చేయాలి’’ అని స్మృతి ఇరానీ అన్నారు.
2014 ఎన్నికల్లో అమేఠీ నుంచి పోటీ చేసిన ఆమె ఓటమి పాలయ్యారు. అనంతరం 2019లో రాహుల్పై విజయం సాధించారు. తాజాగా మరోసారి ఇక్కడి నుంచి బరిలోకి దిగుతున్నారు. అయితే, రాహుల్ గాంధీ మరోసారి అమేఠీ నుంచి పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రదీప్ సింఘాల్ బుధవారం వెల్లడించారు. దీంతోపాటు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీ చేయనున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్