Corona: రాహుల్జీ.. ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి!
ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడిలో విఫలమైందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను..కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తిప్పికొట్టారు.
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కౌంటర్
దిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడిలో విఫలమైందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను.. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తిప్పికొట్టారు. ఆయనను జ్ఞాన బాబాగా పేర్కొంటూ, తన జ్ఞానాన్ని ఇతరులకు పంచేముందు కొన్ని అంశాలను గమనించాలని కోరారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను ఉద్దేశిస్తూ పలు ప్రశ్నలు సంధించారు.
‘• కరోనా రెండోదఫా విజృంభణ ఎక్కడ ప్రారంభమైంది?
• భారత్లో అధిక శాతం కరోనా కేసులు, మరణాలు ఎక్కడ నమోదయ్యాయి?
• మరణాల రేటు అత్యధికంగా ఉన్న రాష్ట్రమేది?
• ఏ రాష్ట్రాలు కరోనా టీకాల గురించి అనవసరంగా గగ్గోలు పెట్టాయి?
• రెండోదశలో పాజిటివిటీ రేటు ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా నమోదైంది? ఈ ప్రశ్నలన్నింటికి ఒకే ఒక్క సమాధానం.. ‘కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. అయితే ఆ రాష్ట్రాల పేర్లను మాత్రం ప్రస్తావించలేదు.
రెండోదశలో దేశం చవిచూసిన కొవిడ్ పరిస్థితులపై రాహుల్ గాంధీ శ్వేతపత్రం విడుదల చేశారు. భవిష్యత్తులో కరోనా విజృంభణలపై అది బ్లూప్రింట్లా ఉపయోగపడుతుందని అధికారులకు సూచించారు. అలాగే కొవిడ్ కేసులు పెరుగుతున్న వేళ ప్రధాని మోదీ దృష్టంతా బెంగాల్ ఎన్నికలపైనే ఉందని విమర్శించారు. ఆయన కన్నీళ్లు.. ప్రజల కన్నీళ్లను తుడవలేవంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. భారత్లో రెండోదశ కరోనా ఉగ్రరూపం చూపింది. మే 7న రికార్డు స్థాయిలో నాలుగులక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. అయితే ప్రజలు కొవిడ్ నిబంధనల పట్ల నిర్లక్ష్యం వహిస్తే, మూడో ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు