Andhra News: గుడివాడ ‘క్యాసినో’పై విచారణ జరపండి: ఈడీకి తెదేపా ఫిర్యాదు

సంక్రాంతి సందర్భంగా ఏపీలోని గుడివాడలో క్యాసినో నిర్వహించిన తీరుపై దిల్లీలోని ఈడీ డైరెక్టర్‌కు తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు.

Published : 08 Feb 2022 14:20 IST

దిల్లీ: సంక్రాంతి సందర్భంగా ఏపీలోని గుడివాడలో క్యాసినో నిర్వహించిన తీరుపై దిల్లీలోని ఈడీ డైరెక్టర్‌కు తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ తదితరులు ఈడీ అధికారులను కలిశారు. క్యాసినో వ్యవహారంపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని కోరారు. 

ఏపీలో అధికార పార్టీకి చెందిన మంత్రి.. గోవా నుంచి గుడివాడకు యువతులను తీసుకొచ్చి సంప్రదాయాలను నట్టేట ముంచారని నేతలు ఆరోపించారు. దీనిపై ఈడీ విచారణ జరిపితే మరిన్ని నిజాలు బయటపడతాయన్నారు. అరాచక శక్తులకు చెక్‌ పెట్టాల్సిన బాధ్యత కేంద్ర సంస్థలపై ఉందని తెదేపా నేతలు వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని