AP News: ఎన్ని పార్టీలు జట్టుకట్టినా.. వైకాపా ఒంటరిగానే పోటీ చేస్తుంది: పెద్దిరెడ్డి

తెలుగుదేశం పార్టీ ముసుగులో అమరావతి ఉద్యమం సాగుతోందని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు

Published : 18 Dec 2021 01:04 IST

అమరావతి: తెలుగుదేశం పార్టీ ముసుగులో అమరావతి ఉద్యమం సాగుతోందని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భాజపాతో ఎలాగైనా జట్టు కట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని పార్టీలు జట్టుకట్టినా వైకాపా ఒంటరిగానే  పోటీ చేస్తుందని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం 3 రాజధానులకు కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇవాళ తిరుపతిలో అమరావతి మహా ఉద్యమసభ నిర్వహించిన విషయం తెలిసిందే.  సభకు వైకాపా మినహా అన్ని రాజకీయ పక్షాల నేతలు హాజరై సంఘీభావం తెలిపారు. ఈనేపథ్యంలో పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలుచేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని