Ts News: రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు అమలు చేయాల్సిందే: బండి సంజయ్
ఎట్టి పరిస్థితుల్లో రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ‘దళితబంధు’ అమలు చేయాల్సిందేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన
కరీంనగర్: ఎట్టి పరిస్థితుల్లో రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ‘దళితబంధు’ అమలు చేయాల్సిందేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంజయ్ మాట్లాడుతూ... ఎన్నికల కోడ్ సాకుగా చూపి దళితబంధు ఆపేశారని, ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ రేపటి నుంచి సీఎం అమలు చేయాల్సిందేనన్నారు.
‘‘ఉప ఎన్నిక సందర్భంగా సీఎం, తెరాస నేతలు వ్యవహరించిన తీరు చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఓటుకు రూ.6వేల చొప్పున పంపిణీ చేశారు. ధన ప్రలోభాలతో గెలవాలని చూశారు. తెరాస గెలిస్తే హుజూరాబాద్ ప్రజలకు అవమానకర పరిస్థితి తలెత్తేది. అందుకే .. మా ఓట్లను డబ్బులతో కొంటారా? అని హుజూరాబాద్ ప్రజలు ఆలోచించారు. వారి విజ్ఞతకు చేతులెత్తి మొక్కాలి. సీఎం, మంత్రులు ఎన్నో అబద్ధాలు చెప్పారు.. ఏకంగా అబద్ధాలకే ఓ శాఖను ఏర్పాటు చేశారు. తెరాస అబద్ధాలను, జిమ్మిక్కులను ప్రజలు నమ్మలేదు. హుజూరాబాద్ ప్రజలకు ఈటల అండగా ఉన్న వ్యక్తి. మంత్రిగా, ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఈటల గెలవడం ఎంతో సంతోషంగా ఉంది. ఉద్యమకారుడిగా ఈటలకు గుర్తింపు ఉంది. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు భాజపా రుణపడి ఉంటుంది’’ అని బండి సంజయ్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం