TS News: జగ్గారెడ్డి క్రమశిక్షణ ఉల్లంఘించినట్టు భావిస్తున్నాం: చిన్నారెడ్డి
ఎమ్మెల్యే జగ్గారెడ్డి క్రమశిక్షణ ఉల్లంఘించినట్టు భావిస్తున్నామని కాంగ్రెస్పార్టీ స్పష్టం చేసింది. టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి అధ్యక్షతన గాంధీభవన్లో సమావేశమైన
హైదరాబాద్: ఎమ్మెల్యే జగ్గారెడ్డి క్రమశిక్షణ ఉల్లంఘించినట్టు భావిస్తున్నామని కాంగ్రెస్పార్టీ స్పష్టం చేసింది. టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి అధ్యక్షతన గాంధీభవన్లో సమావేశమైన నేతలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏమైనా విభేదాలు ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలని స్పష్టం చేశారు. జగ్గారెడ్డిని త్వరలోనే కమిటీ ముందుకు పిలుస్తామని చిన్నారెడ్డి వెల్లడించారు. జగ్గారెడ్డిపై చర్యల అంశం తమ పరిధిలో లేదని .. సోనియాకు జగ్గారెడ్డి రాసిన లేఖ బహిర్గతంపై తెలుసుకుంటామని చెప్పారు. ఇటీవల పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. అంత పెద్ద కార్యక్రమాన్ని తనతో చర్చించలేదని జగ్గారెడ్డి అసంతృప్తి వెలిబుచ్చారు. పీసీసీ అధ్యక్షుడి తీరును తప్పుబడుతూ సోనియాగాంధీకి లేఖ రాశారు. గతంలోనూ రేవంత్రెడ్డి సారథ్యంపై జగ్గారెడ్డి నిరసన తెలిపారు. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయబోనని ప్రకటించిన అప్పట్లో క్షమాపణలు కూడా చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఆయన వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
‘‘టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నాం. కొత్త సంవత్సరంలో కొత్త సంస్కృతిని ఆచరిస్తారని ఆశిస్తున్నాం. జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డికి ఇచ్చిన నోటీసుపై వివరణ ఇచ్చారు. లోతుగా చర్చించాం, కానీ కమిటీ సంతృప్తి చెందలేదు. మళ్లీ ఒకసారి రాఘవరెడ్డితో మాట్లాడాలని కమిటీ భావిస్తోంది. మంచిర్యాల జిల్లా మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్రావు అనుచరులు వీహెచ్ వాహనంపై దాడి చేయడంపై ప్రేమ్సాగర్రావుతో చర్చించాలని భావిస్తున్నాం. దాడి సమయంలో ప్రేమ్ సాగర్రావు ప్రత్యక్షంగా అక్కడ లేరు. పార్టీలో కొన్ని ప్రాంతాల్లో గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో అలాంటి పరిస్థితి ఉన్నట్టు కమిటీ దృష్టికి వచ్చింది.2018 ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసిన వారిని పార్టీ సస్పెండ్చేసింది. వారు మళ్లీ తిరిగి పార్టీలోకి వస్తామని విజ్ఞప్తులు వస్తున్నాయి. వాటిని టీపీసీసీకి అందజేస్తాం’’ అని చిన్నారెడ్డి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం