TS News: దళితబంధుపై తెరాస, భాజపాలవి కపట నాటకాలు: భట్టి

దళితబంధు విషయంలో తెరాస, భాజపాలు కపట నాటకాలు ఆడుతున్నాయని

Updated : 24 Sep 2022 14:27 IST

హైదరాబాద్‌: దళితబంధు విషయంలో తెరాస, భాజపాలు కపట నాటకాలు ఆడుతున్నాయని కాంగ్రెస్‌ శాసనసభ పక్షనేత భట్టి విక్రమార్క విమర్శించారు. బడుగు, బలహీన వర్గాలకు భాజపా వ్యతిరేకమన్న భట్టి.. అందుకే ఆ పార్టీ నిర్ణయాలు అలాగే ఉంటాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనించాలని కోరారు. హుజూరాబాద్‌ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేసి భాజపాకు, తెరాసలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉపఎన్నిక ముగిసేంత వరకు అక్కడ దళితబంధు పథకం అమలును నిలుపుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని