Lok Sabha: తెరాస ఎంపీలపై లోక్సభ స్పీకర్ ఆగ్రహం.. సభ ఆరగంట వాయిదా
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులపై లోక్సభ స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో నిరసన తెలియజేయడం పట్ల స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు.
దిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులపై లోక్సభ స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో నిరసన తెలియజేయడం పట్ల స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. ఆందోళన విరమించి కూర్చోవాలని చెప్పారు. అప్పటికీ తెరాస సభ్యులు శాంతించకపోవడం వల్ల లోక్సభను అరగంట పాటు వాయిదా వేశారు. సమావేశాలు ప్రారంభమైన మూడు రోజుల నుంచి తెరాస ఎంపీలు లోక్సభలో నిరసన గళం వినిపిస్తున్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగుతున్నారు. తెరాస సభ్యుల ఆందోళన నడుమ సభా కార్యకలాపాలకు ఆటంకం కలుగుతుండటంతో తెరాస సభ్యులపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వానాకాలం పంటను కొనాలి: ఉత్తమ్
యాసంగిలో పరి పంటపై ఆంక్షలు లేకుండా చూడటం సహా వానాకాలం పంటను త్వరగా కొనుగోలు చేయాలని నల్గొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై లోక్సభ జీరో అవర్లో ఉత్తమ్ మాట్లాడారు. వానాకాలం పంట కొనుగోళ్లలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. తెరాస ఎంపీలు సీఎం కేసీఆర్తో మాట్లాడి వానాకాలం పంటను కొనిపించాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం