Nara Lokesh: అఘాయిత్యాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఏపీ: లోకేశ్‌ 

సీఎం జగన్‌ పాలనలో అఘాయిత్యాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఏపీ మారిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు.

Updated : 09 Sep 2021 12:17 IST

అమరావతి: సీఎం జగన్‌ పాలనలో అఘాయిత్యాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఏపీ మారిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. గుంటూరు జిల్లాలో మరో దారుణం చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. బైక్‌పై వెళ్తున్న జంటపై దాడి చేసి మహిళపై అత్యాచారానికి పాల్పడటం అమానుషమని చెప్పారు. ఫిర్యాదు చేయడానికి స్టేషన్‌కు వెళ్తే తమ పరిధి కాదని పోలీసులు చెప్పడం దారుణమన్నారు. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం లేదని ఎద్దేవా చేశారు. పరామర్శకు వెళ్తుంటే వేల మంది పోలీసులను రంగంలోకి దించారని మండిపడ్డారు. పోలీసులను రాజకీయ కక్ష సాధింపులకు జగన్‌ వాడుకోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని లోకేశ్‌ విమర్శించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని