కాంగ్రెస్ నుంచి అది ఆశించడం అత్యాశే... ఒమర్ అబ్దుల్లా కామెంట్స్
భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందనుకోవడం అత్యాశే అవుతుందని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు.
శ్రీనగర్: భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందనుకోవడం అత్యాశే అవుతుందని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ నేతలు కుమ్ములాటలో మునిగి తేలుతున్న సమయంలో ఆ పార్టీ నుంచి అలాంటివి ఆశించడం సరికాదంటూ దెప్పిపొడిచారు. కాంగ్రెస్ పార్టీ వేసే అడుగుల ప్రభావం ఎన్డీయేతర కూటమిలో ఉన్న ప్రతి పార్టీపైనా ఉంటుందన్నారు. పంజాబ్ సీఎం అమరీందర్ రాజీనామా నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో భాజపాను ఓడించేందుకు విపక్షాలన్నీ ఏకతాటిపై నడవాలని ఇప్పటికే నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు బయటపడుతుండంపై ఒమర్ ఈ విధంగా వ్యాఖ్యానించడం గమనార్హం.
మరోవైపు అమరీందర్ రాజీనామా నేపథ్యంలో ఇతర పార్టీలకు చెందిన నేతలు తమదైన శైలిలో స్పందించారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ కాంగ్రెస్లో చేరిన రోజే కెప్టెన్ రాజీనామా స్క్రిప్ట్ సిద్ధమైందని హరియాణా ఆరోగ్యమంత్రి అనిల్ విజ్ అన్నారు. భాజపా, కాంగ్రెస్ పార్టీలు రెండూ సీఎంలను మార్చే పనిలో పడ్డాయని ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శించింది. మరోవైపు కెప్టెన్ రాజీనామా కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తుందని, అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి కలిసొస్తుందని విశ్లేషణలు వినవస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం