రైతులతో ప్రధాని ఎందుకు మాట్లాడటం లేదు
కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఇన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్న రైతుల్ని ప్రధాని మోదీ గానీ.. కేంద్ర మంత్రులు గానీ ఎందుకు కలవడం లేదని శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ మీడియాతో మాట్లాడారు.
శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్
దిల్లీ: కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఇన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్న రైతుల్ని ప్రధాని మోదీ గానీ.. కేంద్ర మంత్రులు గానీ ఎందుకు కలవడం లేదని శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ మీడియాతో మాట్లాడారు. ‘రైతులు తమ ప్రాణాలను పణంగా పెట్టి వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఎంతో మంది రైతులు తమ ప్రాణాలు కోల్పోయినా కూడా కేంద్రం పట్టించుకోవడం లేదు. వారికి న్యాయం కూడా చేయడం లేదు. రైతులు ఇంతటి శీతల వాతావరణంలో ఆందోళనలు చేస్తుంటే ప్రధానమంత్రి వారిని కలిసేందుకు ఎందుకు రావడం లేదు’ అని బాదల్ ప్రశ్నించారు.
కేంద్రం సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి మాట్లాడుతూ..‘కేంద్రం ఈ రోజు డిజిటల్ బడ్జెట్ని లోక్సభలో ప్రవేశపెట్టింది. అది డిజిటల్ లేదా పేపర్.. ఏ బడ్జెట్ అయినా కావచ్చు. కానీ సాధారణ ప్రజలకు ప్రయోజనం లేని బడ్జెట్ ఎలా ఉంటే ఏంటి? ’ అని బాదల్ ప్రశ్నించారు. కేంద్ర సాగు చట్టాలకు మద్దతుగా వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్కు వచ్చిన లేఖల గురించి ప్రస్తావించగా..‘మన దేశంలో చాలా బలమైన మీడియా నెట్వర్క్ ఉంది. ఎవరైనా నిజంగా వ్యవసాయ చట్టాలకు మద్దతు తెలిపినట్లు ఏ ఛానల్ అయినా ప్రచురించిందా? అని బాదల్ ప్రశ్నించారు. ‘ఇది కేవలం రైతుల పోరాటమే కాదు.. దేశవ్యాప్త ప్రజల పోరాటం. పార్లమెంటులో రైతుల అంశాన్ని లేవనెత్తాలని ఈ దేశ రైతులు కోరుతున్నారు. అన్ని పార్టీలు ఈ విషయంలో తమ గొంతుకను వినిపించాలి’ అని బాదల్ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!