రాజకీయాలపై వీలైనంత త్వరగా నిర్ణయం: రజనీ
తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై సందిగ్ధత ఇంకా తొలగలేదు. ‘మక్కళ్ మండ్రం’ జిల్లా కార్యదర్శులతో రజనీకాంత్ సోమవారం భేటీ అయ్యారు. దీంతో రాజకీయ ప్రవేశంపై కీలక ప్రకటన ఉండొచ్చని అభిమానులు ఉత్కంఠగా
చెన్నై: తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై సందిగ్ధత ఇంకా తొలగలేదు. ‘రజనీ మక్కళ్ మండ్రం’ జిల్లా కార్యదర్శులతో రజనీకాంత్ సోమవారం భేటీ అయ్యారు. దీంతో రాజకీయ ప్రవేశంపై కీలక ప్రకటన ఉండొచ్చని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూశారు. అయితే వారికి మళ్లీ నిరాశే ఎదురైంది. కాగా.. రాజకీయ ప్రవేశంపై వీలైనంత త్వరగా తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని సమావేశం అనంతరం రజనీ ప్రకటించారు.
స్థానిక రాఘవేంద్ర కల్యాణ మండపంలో ఈ భేటీ జరిగింది. జిల్లా కార్యదర్శులతో కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన రజనీ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘రజనీ మక్కళ్ మండ్రం కార్యదర్శులు, నిర్వాహకులు వారి తరఫు నుంచి లోటుపాట్లు నాకు తెలిపారు. నా అభిప్రాయాలను కూడా వారితో పంచుకున్నాను. రాజకీయ ప్రవేశంపై ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నా నిర్ణయాన్ని ప్రకటిస్తా’ అని రజనీ వెల్లడించారు. కాగా.. రజనీకాంత్ జనవరిలో పార్టీని ప్రకటించే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై జిల్లా కార్యదర్శుల అభిప్రాయాన్ని కోరినట్లు సమాచారాం. మరోవైపు రజనీ పార్టీని స్థాపించిన తర్వాత భాజపాతో పొత్తు పెట్టుకునే అవకాశాలున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే దీన్ని రజనీ మక్కళ్ మండ్రం తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది.
రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై ఇప్పటికే పలుమార్లు ప్రచారం జరిగింది. తాను రాజకీయాల్లోకి వస్తానంటూ మూడేళ్ల కిందటే ప్రకటించినా.. ఇప్పటివరకు పార్టీ ప్రారంభించలేదు. అటు క్రియాశీల రాజకీయాలకు కూడా దూరంగానే ఉంటున్నారు. ఇదిలా ఉండగా.. ఆరోగ్య కారణాల దృష్ట్యా రజనీ తన రాజకీయ ఆలోచన విరమించుకోవాలని వైద్యులు సూచించినట్లు ఆ మధ్య ఓ లేఖ వైరల్ అయిన విషయం తెలిసిందే. డయాలసిస్ పేషెంట్ అయిన రజనీకాంత్ ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో బయట తిరగడం అస్సలు ఆమోదయోగ్యం కాదని డాక్టర్లు చెప్పినట్లు ఆ లేఖలో ఉంది. గత నెల ఈ లేఖ సోషల్మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో లేఖపై స్పందించిన రజనీ.. అది తాను రాసింది కాదని స్పష్టం చేశారు. కానీ అందులోని తన ఆరోగ్య సమాచారం నిజమేనన్నారు. అయితే సరైన సమయంలో రాజకీయ ప్రవేశంపై నిర్ణయం తీసుకుంటానని అభిమానులకు హామీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో సోమవారం అనూహ్యంగా రజనీ మక్కళ్ మండ్రం జిల్లా కార్యదర్శులతో రజనీకాంత్ భేటీ కావడంతో మరోసారి రాజకీయ అరంగేట్రం చర్చ తెరపైకి వచ్చింది. అటు తమిళనాడు శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రజనీ ఈ సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో పార్టీ స్థాపనపై కీలక ప్రకటన వెలువడొచ్చని అభిమానులు భావించారు. అయితే ఈ రోజు కూడా రజనీ ఎలాంటి ప్రకటనలు చేయకపోవడం గమనార్హం. మరి తలైవా రాజకీయాల్లోకి ఎప్పుడు అడుగుపెడతారో చూడాలి..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434