Rajasthan Crisis: పార్టీ హైకమాండ్ని ఎప్పుడూ ఛాలెంజ్ చేయను.. సోనియాకు గహ్లోత్ ఫోన్!
రాజస్థాన్(Rajasthan)లో ఆదివారం అర్ధరాత్రి జరిగిన హైడ్రామా తర్వాత తొలిసారి సీఎం అశోక్ గహ్లోత్(Ashok Gehlot) కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi)తో......
జైపూర్: రాజస్థాన్(Rajasthan)లో ఆదివారం అర్ధరాత్రి జరిగిన హైడ్రామా తర్వాత తొలిసారి సీఎం అశోక్ గహ్లోత్(Ashok Gehlot) కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi)తో మాట్లాడారు. ఈ మేరకు ఆమెకు ఫోన్ చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ను తాను ఎప్పుడూ ఛాలెంజ్ చేయనని ఈ సందర్భంగా గహ్లోత్ ఆమెతో చెప్పినట్టు సమాచారం. గహ్లోత్ వర్గం ఎమ్మెల్యేల తీరుతో కాంగ్రెస్లో సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్ష పదవి బరిలో ఆయన నిలుస్తారా? లేదా అనే విషయంలో ఇంకా సస్పెన్స్ వీడలేదు. పార్టీని ధిక్కరించేలా వ్యవహరించిన గహ్లోత్ను అధ్యక్ష పదవికి పోటీ నుంచి తప్పించాలంటూ సీడబ్ల్యూసీ సభ్యుల నుంచి డిమాండ్లు కూడా వస్తున్నాయి. అయితే, ఇందుకు పార్టీ అధిష్ఠానం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. మరోవైపు, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల విషయంలో తుది నిర్ణయం తీసుకొనే ముందు సోనియా గాంధీ కాంగ్రెస్ సీనియర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే బుధవారం సీనియర్ నేత ఏకే ఆంటోనీతో భేటీ అయ్యే అవకాశం ఉంది.
నేను రేసులో లేను: ఆంటోనీ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో తాను లేనని ఆ పార్టీ సీనియర్ నేత ఏకే ఆంటోనీ స్పష్టంచేశారు. అనారోగ్య కారణాల రీత్యా రెండేళ్ల క్రితమే తాను రాజకీయాలకు దూరంగా ఉన్నట్టు చెప్పారు. మరోవైపు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో నేడు సీఎం గహ్లోత్ ఎలాంటి సమావేశం నిర్వహించలేదని ఆయన కార్యాలయం స్పష్టంచేసింది. ఆయన రోజువారీ విధుల్లోనే ఉన్నట్టు పేర్కొంది.
సోనియా అమ్మలాంటివారు..: ఎమ్మెల్యే
ఇదిలా ఉండగా.. ఎమెల్యేలు ఒకరితర్వాత ఒకరితో హైకమాండ్ పంపించిన పరిశీలకులతో చర్చలకు సిద్ధంగానే ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతాప్సింగ్ కచారియావాస్ అన్నారు. ఇది ప్రజాస్వామ్యమని.. పార్టీ పంపిన పరిశీలకులతో భేటీ కావడానికి నిరాకరిస్తామని భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలందరికీ సోనియా గాంధీ తల్లిలాంటి వారన్నారు. ఆమె ప్రధాని పదవిని తిరస్కరించి గొప్ప ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్కు అప్పగించిన విషయాన్ని గుర్తుచేశారు. పార్టీని కాపాడేందుకు రాహుల్ గాంధీ వేల కి.మీలు పాదయాత్ర చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ బలహీనపడటంలేదని.. గాంధీ కుటుంబ సభ్యులెవరికీ తాము వ్యతిరేకం కాదని స్పష్టంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434