YS Sharmila: బీఎన్ రెడ్డిలో వైఎస్ షర్మిల ధర్నా.. అరెస్టు చేసిన పోలీసులు
గిరిజన మహిళ లక్ష్మిపై పోలీసుల దాడి అమానుషమని వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. బీఎన్రెడ్డిలో స్థానికులతో కలిసి ధర్నా నిర్వహించారు.
హైదరాబాద్: గిరిజన మహిళ లక్ష్మిపై పోలీసుల దాడి అమానుషమని వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ‘‘అర్ధరాత్రి మహిళ స్వేచ్ఛగా తిరిగినప్పుడే మనకు అసలైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అని గాంధీజీ అన్నారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయంటే.. మనకు స్వాతంత్ర్యం వచ్చినట్టా? రానట్టా?’’ అని షర్మిల ప్రశ్నించారు.
బీఎన్రెడ్డి నగర్లోని శ్యామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న బాధితురాలు లక్ష్మిని వైఎస్ షర్మిల పరామర్శించారు. అనంతరం శ్యామ్ ఆసుపత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించి, స్థానికులతో కలిసి ధర్నా చేపట్టారు. రక్షణగా ఉండాల్సిన పోలీసులు ఈ దారుణానికి పాల్పడితే స్వాతంత్ర్యాన్ని గౌరవించినట్లా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలికి 120 గజాల స్థలం ఇస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారట.. కానీ, ఆ విషయం బహిరంగంగా ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. బాధితురాలికి వెంటనే రూ.25లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నాతో ట్రాఫిక్ జామ్ కావడంతో వైఎస్ షర్మిలతో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని హయత్నగర్ పీఎస్కు తరలించారు. అనంతరం లోటస్ పాండ్లోని ఆమె నివాసానికి తీసుకెళ్లారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదు.. కొనుక్కున్నాం
పల్నాడు జిల్లా ముప్పాళ్ల జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదని.. ఎంతో ఖర్చుపెట్టి కొనుక్కుంటే ఆ పదవి వచ్చిందని దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి గోపాలరావు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు నలుగురి నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
ప్రభుత్వ అలసత్వం వల్లే వృద్ధులకు పింఛను కష్టాలు
నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేసి, వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్భూషణ్ హడావుడి
-
రోహిత్కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్గా రావడానికి కారణమిదే!
-
నిజ్జర్ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు..!
-
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
-
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?