Sharmila: ఇది దగా డీఎస్సీ కాక మరేంటి? షర్మిల సంధించిన 9 ప్రశ్నలివే..!
ఏపీ ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నిరుద్యోగుల్ని దగా చేసేందుకేనని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు.
అమరావతి: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ ప్రభుత్వం హడావుడిగా ఇచ్చింది దగా డీఎస్సీయేనని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల (YS Sharmila) మండిపడ్డారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 52వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తే.. ఆయనకు వారసుడిగా చెప్పుకొనే జగనన్న 6వేల పోస్టులతో వేసింది దగా డీఎస్సీ కాక మరేంటని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు చేసే వైకాపా నేతలకు, వాళ్లను మోసే సోషల్ మీడియాకు ఇదే నా సవాల్ అంటూ తొమ్మిది ప్రశ్నలు సంధించారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సామాజిక మాధ్యమాల వేదికగా సవాల్ విసిరారు. షర్మిల సంధించిన 9 ప్రశ్నలివే..
- 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు 25 వేల టీచర్ పోస్టుల భర్తీ ఎక్కడ?
- ఐదేళ్లు నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన ఎందుకు చేశారు?
- ఎన్నికలకు నెలన్నర ముందు 6 వేల పోస్టుల భర్తీ చేయడంలో ఆంతర్యమేంటి?
- టెట్, డీఎస్సీ కలిపి నోటిఫికేషన్ ఇస్తే అభ్యర్థులు దేనికి ప్రిపేర్ అవ్వాలి?
- నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లో పరీక్షలు పెట్టడం దేశంలో ఎక్కడైనా ఉందా ? టెట్కి 20 రోజులు, తర్వాత డీఎస్సీ మధ్య కేవలం 6 రోజుల వ్యవధి మాత్రమేనా?
- వైఎస్ హయాంలో 100 రోజుల గడువు ఇచ్చిన సంగతి వారసుడు జగన్కి గుర్తులేదా?
- ఇచ్చిన సిలబస్ ప్రకారం ఒక్కో అభ్యర్థి 150 పుస్తకాలు చదవాలని మీకు తెలియదా ?
- రోజుకు 5 పుస్తకాలు చదవడం అభ్యర్థులకు సాధ్యపడే పనేనా ?
- మానసిక ఒత్తిడికి గురిచేసి నిరుద్యోగులను పొట్టన పెట్టుకోవాలని కుట్ర చేస్తున్నారా ? ఇది కక్ష సాధింపు చర్య కాదా?
నవ రత్నాలు, జాతి రత్నాలు అని చెప్పుకొనే జగనన్న, ఆయన చుట్టూ ఉండే మంత్రులందరూ ఈ 9 ప్రశ్నలకు దమ్ముంటే సమాధానం చెప్పాలి? అని షర్మిల సవాల్ విసిరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేపు తీన్మార్ మల్లన్న నామినేషన్
తన గెలుపు కోసం యువజన కాంగ్రెస్ సంపూర్ణ సహకారం అందించాలని ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కోరారు. -
నేడు మండలి ‘పట్టభద్రుల’ నోటిఫికేషన్
తెలంగాణ శాసనమండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది.
తాజా వార్తలు (Latest News)
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
హార్దిక్ అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలి: అజిత్ అగార్కర్
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్