YSRCP: సొంతపార్టీ నేతలే మా భూములు ఆక్రమించారు: వైకాపా నాయకుడి ఆవేదన

డిప్యూటీ సీఎం అంజద్‌ బాషా అండతో సుబాన్‌ బాషా అనే వ్యక్తి తన ప్లాట్లను ఆక్రమించుకున్నారని వైకాపా నాయకుడు ఈశ్వర్‌రెడ్డి ఆరోపించారు.

Updated : 09 Jul 2023 15:13 IST

వల్లూరు: వైకాపా నేతలు తమ సొంత పార్టీ నేతల ఆస్తులను కూడా వదలం లేదు. కడప జిల్లా సీకే దిన్నె మండలం రామరాజుపల్లిలోని తమ ప్లాట్లను సొంతపార్టీ నేతలే ఆక్రమించారని వల్లూరు మండలం పెద్దపుత్త గృహసారథి ఈశ్వర్‌రెడ్డి ఆరోపించారు. డిప్యూటీ సీఎం అంజద్‌ బాషా అండతో సుబాన్‌ బాషా అనే వ్యక్తి ఆక్రమించినట్లు తెలిపారు. వల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నకిలీ పత్రాలు సృష్టించి అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని అన్నారు. సుబాన్‌ బాషా బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని